అమరావతిలో 480 ఎకరాలు తాకట్టు పూర్తి ! కానీ డీటైల్స్ సీక్రెట్ ..

మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత ప్రభుత్వం తీరుపై చాలా అనుమానాలొచ్చాయి. మళ్లీ మూడు రాజధానుల బిల్లులు పెడతామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. అమరావతి భూములు కోట్లకు కోట్లు చేస్తాయని తాకట్టు పెట్టడం ప్రారంభించేసింది. సీఆర్డీఏకి రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో వచ్చిన వాటాలో 480 ఎకరాల భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది. మూడు రోజుల కిందట ఉద్యోగులు పెన్ డౌన్ చేసినప్పుడే రాజధానిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందిని రప్పించి పని పూర్తి చేసేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరికి తాకట్టు పెట్టారు.

ఎంతకి తాకట్టు పెట్టారు.. పాత వాటికి గ్యారంటీగా ఇచ్చారా.. కొత్త వాటికా అన్న స్పష్టత మాత్రం రాలేదు. ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ టౌన్ షిప్స్ పేరుతో ప్లాట్లు వేసి అమ్ముతోంది. అందు కోసం నవులూరు దగ్గర ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. వేయక ముందే అమ్మకానికి పెట్టారు అది వేరే విషయం. అయితే ఆ భూమి తనఖాలో ఉంది. ఇప్పుడు ఆ భూమి విషయంలో ముందుకు వెళ్లాలంటే తనఖా నుంచి విడిపించారు. అలా చేయాలంటే డబ్బులు ఉండాలి. అవే ఉంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు అనుకున్నారేమో కానీ.. భూమికి బదులుగా భూమి రిజిస్ట్రేషన్ చేసిచ్చినట్లుగా తెలుస్తోంది.

నేరుగా రాజధాని భూములు అమ్మకానికి పెడితే న్యాయపరమైన సమస్యలు వస్తాయి. అందుకే ఇలా అడ్డదారిలో ఇతర భూమి అమ్మేస్తూ.. ఆ భూమిపై ఉన్న రుణానికి రాజధాని భూముల్ని తనఖా పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వం అయితే రాజధాని భూముల నుంచి తైలం పిండటం ప్రారంభించేసింది. ఇక రెండున్నరేళ్ల సమయం ఉంది. చివరి వరకూ ఏమైనా మిగులుతాయో లేదో ఆ టైం వస్తే కానీ తెలియదన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close