బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు కానీ..అందర్నీ ఒకే సారి చేర్చుకుని షాకివ్వాలని అనుకోవడం లేదు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి చేసి.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడొక ఎమ్మెల్యే.. ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప.. అందరూ కలసి కట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు.

ఇప్పటికే నలుగురు మాత్రమే కాంగ్రెస్ లో చేరినట్లు. తెల్లం వెంకట్రావు , దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్..ఇవాళో రేపో చేరుతారు. నిజానికి ఇతర ఎమ్మెల్యేలు అంతా కలసి కట్టుగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలు చేశారు. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు చేసిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ వారు భేటీలకు హాజరై.. తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంక్ ను కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది. అయితే వారి చాయిస్ కాంగ్రెస్ నా బీజేపీనా అన్నది కూడా ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఉండవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close