ఏపీ ఆర్టీసీకి అత్యాధునిక స్వీడన్ బస్సులు: ఒక్కోదాని ఖరీదు కోటిన్నర

హైదరాబాద్: విభజన జరిగిన తర్వాత విజయవాడ ప్రధాన కార్యాలయంగా ఏర్పడిన ఏపీ ఆర్టీసీ సంస్థ, ప్రయాణీకులకు మెరుగైన సేవలు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. స్వీడన్‌కు చెందిన ‘స్కానియా’ కంపెనీకి చెందిన 15 అత్యాధునిక బస్సులను కోటిన్నర చొప్పున కొనుగోలు చేసింది. మరో 15 రోజుల్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వీటికి బాడీ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.

‘స్కానియా’ సంస్థ ప్రపంచంలోనే విలాసవంతమైన బస్సుల తయారీకి పేరెన్నికగన్నది. ఈ బస్సులలో మల్టీ యాగ్జిల్, హైస్పీడ్ ఇంజన్, విశాలమైన సీటింగ్, పవర్‌‌ఫుల్ ఎయిర్ కండిషనింగ్, భారీ ఎల్ఈడీ స్క్రీన్, డిజిటల్ డాల్బీ సరౌండ్ సిస్టమ్, వైఫై సదుపాయాలు ఉంటాయి. బస్సు లోపలి కదలికలతోపాటు బయట వాహనాల కదలికలను కూడా చూడటానికి వీలుగా సీసీ కెమేరాలు ఉంటాయి. కాక్‌పిట్‌లో డ్రైవర్ తన ఎదుట ఉన్న స్క్రీన్‌లో అన్నింటినీ పరిశీలించగలడు. వీటిని కొనుగోలు చేసేముందు స్కానియా సంస్థ ట్రయల్ చూడటంకోసం ఉచితంగా రెండు బస్సులను రెండు నెలలపాటు తిప్పుకోవటానికి ఆర్టీసీకి గత ఫిబ్రవరి నెలలో అందజేసింది. ట్రయల్ రన్‌లో వీటి పనితీరు నచ్చటంతో అధికారులు 15 బస్సులను కొనుగోలు చేశారు. మరోవైపు దూరప్రాంతాలకు నడిపేందుకు వీలుగా మరో 30 ఓల్వో బస్సులను కూడా ఆర్టీసీ కొనుగోలు చేసింది. వీటిని పలు జిల్లాలకు కేటాయించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close