షెకావత్ షాకివ్వడానికి వస్తున్నారా !?

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వచ్చే నెల 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి పోలవరం వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వీలయినంత త్వరగా తెచ్చి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,656 కోట్లను త్వరితగతిన ఆమోదించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కానీ 2013-14 నాటి ధరలే చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ అంశం పీట ముడి పడిపోయింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నాయి. వీటిని ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అలాగే పునరావసం, నష్టపరిహారం విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య చర్చలు తెగడం లేదు.

ఈ క్రమంలో పోలవరం ఎత్తు తగ్గిస్తే చాలా ఖర్చు మిగిలిపోతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అదే జరిగితే అది ప్రాజెక్టు కాదని బ్యారేజీ పడిపోతుందని ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్ారు. అయితే అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పోలవరం భారాన్ని మోయడానికి సిద్ధంగా లేవు. దీంతో షెకావత్ పర్యటనలో ఎలాంటి ప్రకటనలు వస్తాయన్నదానిపై చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ గా కేంద్రం గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒక్క ఏపీకే కాదని దేశం మొత్తానికి ఉపయోగమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దీన్నయినా గుర్తుంచుకుని ప్రాజెక్టును ప్రాజెక్టుగా ఉంచుతారో… బ్యారేజీగా మారుస్తారో మార్చి నాలుగో తేదీన తేలే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close