కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీస్ జాబితా

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు ఎంపిక చేసిన స్మార్ట్ సిటీస్ జాబితాను ప్రకటించారు. దీనికోసం అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 97పట్టణాల అభివృద్ధికి ప్రతిపాదనలు రాగా, వాటికి వివిధ ప్రామాణికాల ప్రకారం వచ్చిన మార్కుల ఆధారంగా తొలివిడతలో మొత్తం 20 నగరాలను, పట్టణాలను స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. చాలా పారదర్శకంగా ఈ ఎంపిక చేసామని ఆయన తెలిపారు.

ఆ జాబితాలో అన్నిటికంటే 78.83 శాతం స్కోరు సాధించి భువనేశ్వర్ (ఓడిశా) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా పూణే (మహారాష్ట్ర), జైపూర్ (రాజస్థాన్), సూరత్ (గుజరాత్), కొచ్చి (కేరళ), అహ్మదాబాద్ (గుజరాత్), జబల్ పూర్ (మధ్య ప్రదేశ్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), షోలాపూర్ (మహారాష్ట్ర), దావణగేరే (కర్నాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), డిల్లీ, కోయంబత్తూర్ (తమిళనాడు), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), బెల్గావి (కర్నాటక), ఉదయ్ పూర్ (రాజస్థాన్), గౌహతి (అస్సాం), చెన్నై (తమిళనాడు), లుధియానా (పంజాబ్), భోపాల్ (మధ్య ప్రదేశ్) స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయబడ్డాయి.

ఈ జాబితా ప్రకారం అత్యధికంగా మధ్యప్రదేశ్ కి మూడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర , గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెరో రెండు చొప్పున, అస్సాం, కేరళ, పంజాబ్, డిల్లీలకి ఒక్కో స్మార్ట్ సిటీని అభివృద్ధి చేసుకొనే అవకాశం దక్కింది. తెలంగాణాతో సహా అనేక రాష్ట్రాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది కనుక మిగిలిన రాష్ట్రాలకు తరువాత జాబితాలలో చోటు దక్కవచ్చును. ఈ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం సుమారు రూ.3.30 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close