గీతా ఆర్ట్స్‌లో వక్కంతం వంశీ నెక్స్ట్!

దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వరని మెగా కాంపౌండ్ మీద ఒక విమర్శ. ఇటు రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తే చిరంజీవి, అటు అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే అర‌వింద్‌ ప్రతి విషయంలోనూ అడుగడుగునా దర్శకుడు వెనకుండి సినిమా బండి నడిపిస్తారని టాక్. ముఖ్యంగా గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ సూచించే మార్పులు చేర్పులు చేసి సిన్మాను బయటకు తీసుకురావడం అంత వీజీ కాదంటారు. కాని తమకు నచ్చిన దర్శకులు దొరికితే మెగా కాంపౌండ్ అంత తేలిగ్గా వదులుకోవడం లేదు. వెంటనే రెండో సినిమాకు సంతకం చేయించుకుంటున్నారు. పైన వచ్చే విమర్శలు పక్కన పెడితే దర్శకులు కూడా మెగా హీరోలతో, మెగా నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

‘సరైనోడు’ తరవాత చిరంజీవి హీరోగా సినిమా చేసేలా ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒప్పందం చేసుకున్నారు. చిరు ఇతర సినిమాల వల్ల ఆలస్యమైంది. ‘ధృవ’ తరవాత చిరంజీవి హీరోగా ‘సైరా’ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఇప్పుడు వక్కంతం వంశీ వంతు వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడీ రచయిత. ఈ సినిమాను నిర్మాత లగడపాటి శ్రీధర్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించాడు బన్నీ. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, ముఖ్యంగా ‘బన్నీ’ వాసు సినిమా వ్యవహారాలు చూసుకున్నారు. సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ హ్యాండ్ వుంది. అదే గీతా ఆర్ట్స్‌లో వక్కంతం వంశీ నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో “ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యాక వంశీతో అతని రెండో సినిమా కూడా మేమే నిర్మిస్తామని చెప్పాం” అని ‘బన్నీ’ వాసు వ్యాఖ్యానించారు. సో… దర్శకుడి నుంచి ముందుగా మాట తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ సినిమా కూడా అల్లు అర్జున్ చేస్తాడా? రామ్ చరణ్, మిగతా హీరోలలో ఎవరితో అయినా చేస్తారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close