వెంకయ్య లేదా అనసూయ ఊకే ! ఇద్దరిలో రాష్ట్రపతి ఎవరు ?

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించబోతున్నారా? లేకపోతే ఆశలు పెట్టుకున్న ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారా ? ఈ అంశం ఢిల్లీలో హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఏ క్షణమైనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించబోతోంది. అయితే పార్లమెంటరీ బోర్డు ఆమోదం లాంచనప్రాయమే..అసలు నిర్ణయాలు మాత్రం మోడీ, షా చేతుల్లోనే ఉంటాయి. వారు ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారెవరన్నది స్పష్టత లేదు. హైదరాబాద్‌లో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.

వెంటనే ఆయన వద్దకు అమిత్ షా, నడ్డా వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రచారం ఊపందుకుంది. అయితే అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని..కేవలం బుజ్జగింపులకు వెళ్లారని అంటున్నారు. ఈ సారి ఎస్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని అందుకే చత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఊకేను అందు కోసం ఫైనల్ ఛేశారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే దక్షిణాది సమీకరణాలతో వెంకయ్యనాయుడుకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా రాష్ట్రపతి రేసులో చివరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు కాగా మరొకరు అనసూయఊకే. అయితే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుని మోదీ, షాలు అంగీకరించరన్న ఓ వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ ఇమేజ్ లేని రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసినట్లుగానే ఈ సారి అనసూయ ఊకేను చేస్తారన్న ప్రచారం మాత్రం ఎక్కువగా సాగుతోంది. ఈ సస్పెన్స్ సాయంత్రానికి తేలిపోయే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

కళ్ల ముందు ఓటమి – వాస్తు మార్పులతో జగన్ ప్రయత్నం !

అభ్యర్థులను మార్చారు వర్కవుట్ అవలేదు. బస్సు యాత్ర పేరుతో తనను తాను మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు వర్కవుట్ అవ్వలేదు.. ప్రజలు మార్పు చేయడానికి సిద్ధమయ్యారని స్పష్టత రావడంతో చివరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close