బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో…జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇదెంత తప్పుడు వ్యూహమో.. వైసీప వ్యూహకర్తలకు మొదటి రోజే అనుభవంలోకి వచ్చింది.

జగన్ బస్సు యాత్రకు ఎక్కడా కవరేజీ రాలేదు. చివరికి జగన్ బయటకు అడుగేస్తే… లైవ్ అవ్వాలని అప్రకటిత ఒప్పందాలున్న నీలి, కూలి మీడియా చానళ్లు కూడా.. జగన్ బస్సు యాత్రను కవర్ చేయలేదు. సాక్షి మీడియా ఇచ్చిన కవరేజీ నవ్వుల పాలయింది. జనాల్లేని దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంపల్లెలోనే జగన్ పది నిమిషాల్లో వస్తున్నారని తెలిసినా పట్టుమని ఇరవై మంది కూడాలేరు. ఇక ఇడుపుల పాయ వైపు దృశ్యాలు చూపించడానికి చానళ్లు సిద్ధపడలేదు. నీలి, కూలి మీడియాకు కూడా సొంతకవరేజీకి చాన్స్ ఇవ్వడం లేదు.

ఇడుపులపాయ నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చే వరకూ… మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా.. బస్సు నెమ్మదిగా వచ్చినా.. ఎక్కడైనా ఆయనకు జన ప్రవాహంతో ఉన్న దృశ్యాలను కవర్ చేయలేకపోయారు. అలాంటి పరిస్తితి కనిపించలేదు. ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తోంది. కొన్ని ఐ ప్యాక్ స్కిట్లు వేసినా అవి నవ్వుల పాలయ్యాయి. ఎండాకాలంలో… బస్సు యాత్ర పెట్టడం.. క్యాడర్ ను వదిలేసి వాలంటీర్ల మీద రాజకీయం చేస్తున్న సమయంలో వారు ఉత్సాహంగా వస్తారని ఆశించడం కూడా తప్పేనని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close