రాజ్యసభ ఎన్నికల వరకూ జాబితాలపై కసరత్తు లేనట్లే !

వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి ఇప్పటికి ఆరుజాబితాలు విడుదల చేశారు. అంత అవసరం ఏమొచ్చిందో కానీ.. ఆయన జాబితాల మీద జాబితాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఏడో జాబితా కూడా రెడీ అవుతోందని రెండు రోజుల కిందట మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యసభ ఎన్నికల వరకూ ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేల సంఖ్య పలుచగా ఉంది. వారిలో సంతృప్తిలెవరో.. అసంతృప్తులెవరో తెలియడం లేదు. అసెంబ్లీలో గతంలోలాగా టీడీపీ సభ్యుల్ని గట్టిగా ఎవరూ ఎదుర్కోవడం లేదు.

ఈ పరిణామాలన్నింటినీ గమనించిన జగన్ రెడ్డి ఈ సారి జాబితా గురించి పక్కన పెట్టారు. నిజానికి అసలు మార్చాలనుకుంటున్న నియోజకవర్గాలు ఇప్పుడే ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. వరుసగా గెలుస్తూ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న రెడ్డి సామాజికవర్గ నేతల్ని పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఓ ముఫ్పై, నలభై వరకూ మార్పులుంటాయని అంచనా. చివరికి శ్రీకాంత్ రెడ్డి వంటి వారికీ గ్యారంటీ లేదు. వారికి ఇప్పుడు టిక్కెట్ నిరాకరిస్తే తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. అన్నీ ఆలోచించి రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకూ ఇంక ఎలాంటి లీకులు ఇవ్వకుండా.. అభ్యర్థులపై కసరత్తు చేయకుంా టైం పాస్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే తొందరపడి ప్రకటించిన జాబితాల వల్ల పార్టీలో సంక్షోభం ఏర్పడిందని..టిక్కెట్ దక్కని వాళ్లు పూర్తిగా రివర్స్ అయితే.. టిక్కెట్ దక్కిన వాళ్లు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి వెళ్లారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close