కాంగ్రెస్‌తోనూ వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట !

ఏపీలో వైసీపీ ఇంచార్జులమార్పు వ్యవహారం కామెడీ అయిపోతోంది. తమతో ఆపార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా బెదిరిస్తోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తారని.. ఇప్పుడు వైసీపీలో టిక్కెట్ నిరాకరించిన వారంతా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఆ విషయంలో ఎలాంటి సూచనలు కనిపించనప్పటికీ… ఏపీ పీసీసీ చీఫ్ మాత్రం … వైసీపీతకో మైండ్ గేమ్ ప్రారంభించారు.

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తారని.. రేవంత్ రెడ్డి అండతో… పార్టీని బలోపేతం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల ఇంత వరకూ తాను ఏపీ రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా చెప్పలేదు. కనీసం ఆ దిశగా ఒక్క ప్రకటన కానీ.. పర్యటన కానీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపైనే స్పందిస్తున్నరు. కానీ తెలంగాణలో ఆమెకు రాజకీయ భవిష్యత్ లేదని ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతోనే తేలిపోయిందన్న విశ్లే,షణలు ఉన్నాయి. రాజకీయాల్లో కొనసాగలంటే… కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో రాజకీయం చేయడమేనని అంటున్నారు.

ఇప్పటికీ..ఈ అంశంపై షర్మిల తన అనుకూలతను వ్యక్తం చేయలేదు. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి షర్మిల ఏపీలోకి వస్తే తన ఓటు బ్యాంక్ కు భారీగా గండి పడుతుందన్న అనుమానంతో.. ఆమె ఏపీలోకి రాకుండా… కొంత మంది మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close