తెదేపాను ముంచడానికే వైకాపా ఎమ్మెల్యేలు వెళ్తున్నారా?

ఒకవేళ అచ్చంగా ఆ పార్టీని ముంచే ఉద్దేశంతో వెళుతున్నప్పటికీ కూడా.. ఆ విషయాన్ని బహిరంగంగా ఎవరూ ఒప్పుకోరు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రోజా తన వ్యాఖ్యలతో తెదేపాలోకి వెళ్తున్న వైకాపా వారి మీద కొత్త అనుమానాలు పుట్టే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఈ ఫిరాయింపుల నేపథ్యంలో.. తనదైన శైలిలో చంద్రబాబు మీద విరుచుకుపడిన రోజా.. ఫిరాయిస్తున్న వారిని సహజంగానే తిట్టిపోశారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ఇలా వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వలన తెలుగుదేశానికే నష్టం అని.. ఎంత ఎక్కువ మంది చేరితే ఆ పార్టీ అంత తొందరగా మునిగిపోతుందని రోజా అంటున్నారు.

తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో గానీ.. రోజా మాటలు వింటే మాత్రం.. తెలుగుదేశాన్ని ముంచడానికే వైకాపా ఎమ్మెల్యేలను వీళ్లే ట్రెయిన్‌ చేసి పంపుతున్నట్లుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.

ఈ సందర్భంగా రోజా మాత్రం చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడుకు వయసు అయిపోయిందని.. ఆయనకు చూపు కూడా మసకబారిపోయిందని.. పార్టీ మీద పట్టు సన్నగిల్లిపోయిందని తన వైఫల్యాల మీదనుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే.. ఇలాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని రోజా అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన వైకాపాకు వచ్చే నష్టం ఏమీ లేదని రోజా వ్యాఖ్యానించారు. వెళ్లిపోయిన వారు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆమె డిమాండ్‌ చేశారు. చంద్రబాబునాయుడు సొంతంగా ఒక పార్టీ పెట్టి, ఒక సీటు అయినా సాధించగలరా అంటూ ఆమె డిమాండ్‌ చేయడం విశేషం. చంద్రబాబు, లోకేశ్‌ అవినీతి అంతా దోచుకుంటున్నారని, అవినీతిలో వారు డబుల్‌ డిజిట్‌ సాధించారని ఆమె దుయ్యబట్టారు. ఇన్ని నిందలు వేసినప్పటికీ.. వైకాపా నేతలు ఎంత ఎక్కువ మంది తెదేపాలోకి వెళితే అంత తొందరగా ఆ పార్టీ మునిగిపోతుందంటూ రోజా భవిష్య వాణి వినిపించడమే చిత్రమైన సంగతిగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close