బెంగళూరు ఘటనపై రాహుల్ స్పందించరు. ఎందుకంటే…

బెంగళూరు నగరంలో పట్టపగలు టాంజానియాకి చెందిన ఒక విద్యార్ధినిని కొందరు బట్టలూడదీసి రోడ్డు మీద పరుగులు తీయిస్తే, అటువంటిదేమీ జరుగలేదని కర్నాటక రాష్ట్ర హోంమంత్రి సమర్ధించుకోవడం సిగ్గు చేటు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్నాటక ప్రభుత్వం సంఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మొదలుకొని అదనపు కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వద్ నారాయణ వరకు చాలా మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అంతటితో దాని కర్తవ్యం పూర్తయినట్లు మాట్లాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కనుక వారినీ తప్పు పట్టడానికి లేదు.

అందరూ ఎవరి పని వారు చేస్తున్నట్లు, అంతా సవ్యంగానే ఉన్నట్లు పైకి కనబడుతోంది. కానీ మహిళా ఉద్యోగినులపై అత్యాచారాలు, పట్టపగలే ఇటువంటి దారుణ సంఘటనలు, ఉగ్రవాదులకు మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ చెపుతున్న మత అసహనం వంటివన్నీ ఎక్కువగా బెంగళూరు నగరంలోనే తరచూ కనిపిస్తుంటాయి. కానీ వాటిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఎన్నడూ మాట్లాడరు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

మన దేశంలో చదువుకోవడానికి వచ్చిన ఒక విదేశీ విద్యార్ధినికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇంత ఘోర అవమానం జరిగితే రాహుల్ గాంధి కనీసం దాని గురించి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోవడం చాల శోచనీయం. అది ఆయన ద్వంద నీతికి అద్దం పడుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున డిల్లీలో ప్రేలుళ్ళకు కుట్రలు పన్నుతున్న వారిని బెంగళూరు నుండే ఎన్.ఐ.ఏ. అధికారులు అరెస్ట్ చేసారు. దేశ ఐటి రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరం క్రమంగా నేరాల రాజధానిగా మారిపోతోందని ఇటువంటి సంఘటనలు తెలియజేస్తున్నాయి.

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం నేర నియంత్రణకి కటినంగా వ్యవహరించవలసి ఉంది కానీ ఈ సంఘటనలో తమ పార్టీకి, ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట చుట్టుకోవడంతో దాని నుండి తప్పించుకొనేందుకు పోలీస్ అధికారులపై వేటు వేసి వారిని బలిపశువులు చేస్తోంది.

టాంజానియా విద్యార్ధినికి జరిగిన అవమానం గురించి మీడియా వెలువరించిన కధనాలు తప్పని, అటువంటిదేమీ జరుగలేదని హోం మంత్రి వాదిస్తున్నపుడు సుమారు డజను మంది పోలీసులను, పోలీస్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేస్తున్నట్లు? తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పకుండా ఆ తప్పును కప్పి పుచ్చుకోవాలని హోంమంత్రి ప్రయత్నిస్తున్నపుడు ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రంలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఉపేక్షిస్తోంది? అనే సందేహాలకు వారే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close