ముంబై 26/11 దాడులకు ఏవిధంగా ప్రణాళికలు రచించామంటే…

26/11 ముంబై దాడులకు ముందు అందుకు అవసరమయిన మ్యాపులు, ఫోటోలు వంటి సమాచారాన్ని అంతా సేకరించి పాక్ లోని లష్కర్ ఉగ్రవాదులకు అందజేసిన ఇచ్చిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై దాడుల కేసులో అతను ‘అప్రూవర్’ మారడానికి అంగీకరించడంతో భారత్ అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం అతనిని ఈ కేసులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారించేందుకు అంగీకరించింది. నిన్న మొదటిరోజున ఆ దాడుల గురించి, వాటి సూత్రధారుల గురించి హెడ్లీ చాలా విషయాలు చెప్పాడు. మళ్ళీ ఈ రోజు విచారణలో ఇంకా దిగ్బ్రాంతికరమయిన విషయాలు బయటపెట్టాడు. ఆ వివరాలు:

2003 సం.లో నేను మొదటిసారిగా జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని పాకిస్తాన్ లో దక్షిణ లాహోరు ప్రాంతంలో కలిసాను. అదే సం.లో జాకీర్ ఉర్ర్ రెహ్మాన్ లక్వీని కూడా ముజఫరాబాద్ లో కలిసాను. అలాగే భారత్ కి మత్తుమందులు, ఆయుధాలు సరఫరా చేసే జేబ్ షా అనే వ్యక్తిని కూడా కలిసాను. మరికొందరు ఉగ్రవాదులను కూడా కలిసాను.నేను పాక్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ., పాక్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేసేవాడిని. పాక్ ఆర్మీకి చెందిన అనేకమందిని నేను కలిసేవాడిని. అయితే వారి నుండి నాకు డబ్బు అందలేదు.

2006సం.లో నేను, లష్కర్ కి చెందిన ముజబిల్ బట్, సాజిద్ మీర్, అబూ ఖఫ్ఫాలతో సమావేశం అయ్యాము. ఆ సమావేశంలో భారత్ లో మా కార్యకలాపాలు సాగించేందుకుగాను ముంబైలో ఒక కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయం జరిగింది.

ఐ.ఎస్.ఐ.కి చెందిన మజర్ ఇక్బాల్ ముంబై నగరంలో ప్రముఖ ప్రాంతాలను వీడియో తీసి ఇమ్మని వారు కోరారు. అలాగే రెక్కి నిర్వహించి దానిని కూడా వీడియో తీసి అందించమని కోరారు. నన్ను భారత ఆర్మీకి సంబంధించిన వివరాలు కూడా సేకరించామని లష్కర్ ఉగ్రవాదులు కోరారు. అందుకోసం ఆర్మీలోనే తమ కోసం పనిచేయగల వ్యక్తిని గుర్తించమని కోరారు.

ముంబై లోని వివిధ ముఖ్యమయిన ప్రదేశాలను గుర్తించడానికి వారు నాకు జి.పి.ఎస్ పరికరాన్ని అందజేశారు. తాజ్ హోటల్, ఒబిరాయ్ హోటల్, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, ముంబైలోని మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్, చత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్, లియోపోల్ద్ కేఫ్, కొలాబా పోలీస్ స్టేషన్, ఆ పరిసరాలలో ఉన్న ప్రముఖ షాపులు హోటల్స్, కొలబాలోని భగత్ సింగ్ మార్గ్ రోడ్డు తదితర ప్రాంతాలను వీడియో తీసి ఇచ్చేను. ముఖ్యంగా అక్కడ ఉన్న సిద్ది వినాయక మందిరం ఫోటోలను, వీడియోని తీసి ఇమ్మని వారు నన్ను కోరారు. నేను వారు కోరినట్లే అన్నీ తీసి లష్కర్ నేత సాజిద్ మీర్, ఐ.ఎస్.ఐ. అధికారి మేజర్ ఇక్బాల్ కి అందజేసాను.

అందుకోసం నేను ముంబైకి సెప్టెంబర్ 14, 2016లో మొట్ట మొదటి సారిగా వచ్చేను. నేను నా భార్య ఫైజా తో కలిసి తాజ్ హోటల్ రెండవ అంతస్తులో బస చేసాను. పాక్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ తహవ్వుర్ హుస్సేన్ రానా అనే వ్యక్తి నాకు స్కూల్లో స్నేహితుడు. అతని స్నేహితుడయిన బషీర్ షేక్ మేము ముంబై వచ్చినప్పుడు మమ్మల్ని ముంబై విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొన్నాడు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి నేను ముంబైలో అతను నాకు చాలా సహకరించాడు. దాడులు చేయడానికే ఈ సమాచారం అంతా సేకరిస్తున్నట్లు నాకు తెలుసు కానీ అప్పటికే ముంబై మీదే దాడులు చేయాలని లష్కర్ ఉగ్రవాదులు నిర్ణయించుకొన్నట్లు నాకు అప్పటికి ఇంకా తెలియదు. నేను ఉగ్రవాదుల కోసం పని చేస్తున్నాననే సంగతి నా భార్య ఫైజాకి తెలియగానే ఆమె ఇస్లామాబాద్ లోని అమెరికన్ ఎంబసీలో నాపై పిర్యాదు చేసింది.

మళ్ళీ 2007సం.లో ముజఫరాబాద్ లో గల లష్కర్ సంస్థ కార్యాలయంలో ఖఫ్ఫా మరియు మీర్ సమావేశమయ్యి నేను అందించిన తాజ్ హోటల్ ఫోటోలు, వీడియోల ఆధారంగా దాడులు చేయవలసిన ప్రాతాలను గుర్తించారు. ఆ హోటల్లో భారతీయ శాస్త్రవేత్తలు సమావేశం జరుగబోతున్న కాన్ఫరెన్స్ హాలు ఫోటోలను కూడా వారిరువురూ పరిశీలించి అక్కడ దాడులకు పాల్పడటం గురించి చర్చించుకొన్నారు. కానీ అక్కడికి ఆయుధాలతో చేరుకోవడం కష్టం అవుతుందని ఆ ఆలోచన విరమించుకొన్నారు.
లష్కర్, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహుద్దీన్ అనే మూడు ఉగ్రవాద సంస్థలు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే సంస్థ క్రింద పనిచేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close