జగన్ రెడ్డి రాష్ట్రంలో అలజడి రేపేందుకు కుట్రలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా రౌడీలను వెంట బెట్టుకుని తొక్కి పడేస్తాం.. నరికేస్తాం అంటూ రెచ్చగొడుతూ.. సామాన్యులపై దాడులు చేస్తూ.. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అవసరం లేకపోయినా జిల్లా మొత్తం నుంచి నాలుగైదు వేల మందిని సమీకరించి వారితో రచ్చ చేస్తున్నారు. ఇదంతా అలజడి రేపాలన్న కుట్రతోనే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏం లాభం వస్తుంది?. రాజకీయంగా జగన్ బలపడే అవకాశం లేదు. మరి ఎందుకు ? రాష్ట్రంపై కుట్రలు చేయడానికే.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర
జగన్ రెడ్డి మొదటి నుంచి ఒకటే ప్లాన్ అమలు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఒక్క అభివృద్ది పని జరగకుండా.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం, పెట్టుబడిదారులకు భయానక వాతావరణం కల్పించడం వంటివి చేస్తారు. 2014-19 మధ్య తుని ఘటన దగ్గర నుంచి గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడి వరకూ లెక్కలేనన్ని జరిగాయి. ఆ కేసులన్నీ తాను సీఎం కాగానే ఎత్తేశారు. అంటేనే అందులో ఉన్న కుట్రలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఈ సారి తనకు బలం తక్కువగా ఉంది కాబట్టి పూర్తిగా రౌడీయిజం మీదనే ఆధారపడుతున్నారు.
అమరావతిపై అడ్డగోలు కుట్రలు
ఏపీకి రాజధాని అనేది ఉండకూడదని జగన్ రెడ్డి కుట్ర. అమరావతి అసలు ఉండకూడదు. అసెంబ్లీలో అంగీకారం తెలిపి బయటకు వచ్చి కుట్రలు చేస్తున్నారు. నేరుగా అమరావతిని వ్యతిరేకించడం లేదు. ఏదో ముష్టి వేస్తున్నట్లుగా అక్కడ కట్టుకోండి.. ఇక్కడ కట్టుకోండి అంటున్నారు. ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న ఘోరమైన మనస్థత్వంఆయనది. ప్రజలకు పది రూపాయలు ఇస్తే చాలు బానిసల్లా పడి ఉంటారని అనుకుంటారు. అలాంటి వ్యక్తికి అభివృద్ధి.. అవసరం లేదు. ప్రజలు బాగుపడితే మాట వినరని ఆయన అనుకుంటారు. అందుకే అమరావతి లాంటి ప్రాంతాలను నిర్వీర్యం చేయాలని అనుకుంటారు.
రాజకీయాలు మారిపోయాయి – మారొద్దా ?
ప్రజల మధ్య కులమతాలకు చిచ్చు పెడితే చాలు మన బలం మనకు ఉంటుందని జగన్ రెడ్డి అనుకుంటున్నారు . కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు రాజకీయం మారింది. గుప్పెడు మంది మూకలు రౌడీయిజం చేస్తే ప్రజలు భయపడే పరిస్థితి లేదు. తిరగబడుతున్నారు. ప్రజల కోసం రాజకీయం చేస్తే నలుగురు మద్దతుగా వస్తారు. అరాచకం చేస్తామంటే…మద్దతు లభించదు. కానీ జగన్ రెడ్డి అంతా తన కుటుంబంపై ప్రయోగించిన రాజకీయాన్నే.. రాష్ట్రంపై ప్రయోగించి అరాచకం చేస్తున్నారు. ప్రజల్లో భయం పెంచుతున్నారు.