బెల్లంకొండ ‘షాకింగ్‌’ ప్రాజెక్ట్‌|

ఛ‌త్ర‌ప‌తితో హిందీ లో అడుగుపెడుతున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. అది హిందీ సినిమానే అయినా, సౌత్‌లో అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. ఛ‌త్ర‌ప‌తి చూసేసినా, తెలుగులోనూ ఈ సినిమాని విడుద‌ల చేస్తారు. ఈలోగా బెల్లంకొండ ముందుకు మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్ట్ వ‌చ్చింది. ఈసారి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంద‌ని టాక్‌. ఓ అగ్ర ద‌ర్శ‌కుడు ఈసారి ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడి వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో చాలామంది స్టార్ల పేర్లు క‌నిపిస్తాయ‌ని, ఈ కాంబినేష‌నే షాకింగ్ గా ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ ప్రాజెక్టులో ఎవ‌రెవ‌రు ఉంటారో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. మ‌రోవైపు `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ ప‌నులు శ‌ర వేగంగా సాగిపోతున్నాయి. ఈ సినిమాకి స‌రైన టైటిల్ కోసం చిత్ర‌బృందం ఇంకా అన్వేష‌ణ కొన‌సాగిస్తోంది. `ఛ‌త్ర‌ప‌తి` అనే టైటిల్ నే హిందీలోనూ పెడ‌దామ‌నుకుంటే, ఆ టైటిల్ మ‌రొక‌రు రిజిస్ట‌ర్ చేయించేసుకున్నారు. `ఛ‌త్ర‌ప‌తి శివాజీ`, `శివాజీ` అనే పేర్లుకూడా అందుబాటులో లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close