‘వి’ టీమ్ కి షాక్ ఇచ్చిన అమేజాన్‌

నానికి అచ్చొచ్చిన తేదీ సెప్టెంబ‌రు 5. స‌రిగ్గా ప‌న్నెండేళ్ల క్రితం హీరోగా త‌న తొలి సినిమా అష్టాచ‌మ్మా… ఈరోజే విడుద‌లైంది. త‌న 25వ సినిమా `వి` కూడా ఇదే రోజున విడుద‌ల చేద్దామ‌న్న‌ది ప్లాన్‌. అమేజాన్ కూడా దానికి ఓకే చెప్పి `వి`ని సెప్టెంబ‌రు 5న విడుద‌ల చేయ‌డానికి సై అంది. దాంతో నాని టీమ్ హ్యాపీ గా ఫీల‌య్యింది. త‌మ‌కు అచ్చొచ్చిన తేదీనే 25వ సినిమా రావ‌డంతో.. సంతోషం వ్య‌క్తం చేసింది. అమేజాన్ లెక్క‌ల ప్ర‌కారం.. ఈ సినిమాని స‌రిగ్గా అర్థ‌రాత్రి 12 గంట‌ల 5 నిమిషాల‌కు స్ట్రీమ్ చేయాలి.

కానీ అమేజాన్ షాక్ ఇచ్చింది. రాత్రి ప‌ది గంట‌ల‌కే ఈ సినిమాని స్ట్రీమింగ్ కి ఉంచింది. నిజానికి ఈ సినిమా 10 గంట‌ల‌కే విడుద‌ల చేస్తున్నార‌న్న విష‌యం `వి` టీమ్‌కి అస్స‌లు తెలీదు. దాంతో పాటు… నాని సెంటిమెంట్ లెక్క కూడా మారిపోయింది. `వి` సెప్టెంబ‌రు 5న కాకుండా 4నే విడుద‌లైపోయింది. ప‌ది గంట‌ల‌కు ఈ సినిమాని స్ట్రీమింగ్‌కి ఉంచుతున్న‌ర‌న్న విష‌యం దిల్ రాజు పీఆర్ టీమ్ కి సైతం తెలియ‌లేదు. 12 గంట‌ల‌కు క‌దా.. అని చాలామంది 12 వ‌ర‌కూ ఎదురు చూసి, అమేజాన్ మీట నొక్కాల్సివ‌చ్చింది. మొత్తానికి అమేజాన్ తొంద‌ర‌ప‌డ‌డం వ‌ల్ల – నాని సెంటిమెంట్ డేట్ ని మిస్ అవ్వాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close