ఢిల్లీకి చేరిన ఏపీ బీజేపీ సీట్ల పంచాయతీ !

ఏపీ బీజేపీ సీట్ల పంచాయతీ ఢిల్లీ చేరింది. తమలో తాము తేల్చుకోలేక చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ.. ఆటు వైపు నుంచి నరుకొచ్చేందుకు ప్రో వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నేతల సంప్రదింపుల్లో ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లను ఖరారు చేసుకున్నారు. వాటిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్ర నేతలు వెళ్లిపోయారు. ఇక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే సమయంలో.. ప్రో వైసీపీ నేతలెవరికీ టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవని తేలిపోయింది. తమకు చాన్స్ దక్కకుండా నియోజకవర్గాలను ఖరారు చేసుకున్నారంటూ బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఓ పది మంది హైకమాండ్ కు లేఖ రాశారు. అందులో.. టీడీపీ మోసం చేస్తోందని.. కొంత మంది టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా బీజేపీతో కలిసి మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్న వారికి టిక్కెట్లు దక్కనీయడం లేదంటున్నారు. వీరి ఉద్దేశం ప్రకారం.. పార్టీని నమ్ముకున్న వారు వారే… వారితో పాటు వారి వెనుక ఉన్న కొంత మంది సీనియర్లు కూడా. సోము వర్రాజు, జీవీఎల్ వంటి వారన్నమాట.

ఈ లేఖ ఎఫెక్టో లేకపోతే మరో కారణమో కానీ పురందేశ్వరి ఢిల్లీ వెళ్లారు. అభ్యర్థులను ఖరారు చేయించడానికి వెళ్లారని.. సీట్లపై స్పష్టత ఉందని.. మార్పులేమీ ఉండవని చెబుతున్నారు. కానీ కొంత మంది సీనియర్ నేతలు మాత్రం.. వారికి చాన్స్ వచ్చేలా చేసుకోవడానికి నియోజకవర్గాలు మార్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close