మోదీ రాక – స్కూల్స్ ఓపెనింగ్ వాయిదా !

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తే స్కూళ్లకు సెలవు ఇస్తారా? అలాంటి సంప్రదాయం ఎక్కడైనా చూశామా ? అసలు ప్రధాని రాష్ట్ర పర్యటనకు వెళ్లడానిక స్కూళ్లకు సెలవులివ్వడానికి ఏమైనా లింక్ ఉందా? బుర్రలు బద్దలు కొట్టుకున్నా.. లింక్ మనకు అర్థం కాదు. కానీ ఏపీ ప్రభుత్వానికి మాత్రం లింక్ ఉంది.. ఉంటుంది.. ఖచ్చితంగా ఉంటుందని అనిపించింది. అందుకే ప్రధాని మోదీ ఏపీకి వచ్చే రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించేశారు.

జూలై నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు భీమవరం వస్తున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆ రోజు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి స్కూళ్లు ఆ రోజే ప్రారంభం అవుతున్నాయి. ప్రతీ ఏటా జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే స్కూళ్లను ఈ సారి జూలైలో ప్రారంభించాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభమయ్యాయి.కానీ ఏపీలో మాత్రం వచ్చే నెల నాలుగో తేదీకి ముహుర్తం పెట్టారు. ఇదే ఆలస్యం అనుకుంటే ఆ రోజు ప్రధాని మోదీ వస్తున్నారని ఆ రోజు సెలవు ఇచ్చేశారు. జూలై ఐదో తేదీనుంచి స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు.

అసలే ఏపీలో విద్యావ్యవస్థ పరిస్థితి దారుణంగా ఉందన్న ప్రచారం జరుగుతూండగా.. ఇప్పుడు స్కూళ్ల సీజన్ నెల రోజుల పాటు వాయిదా వేయడమే కాకుండా.. మోదీ వస్తున్నారని.. సెలువు ప్రకటించడం తల్లిదండ్రుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. మోదీ వచ్చినా అసలు స్కూళ్లకు ఆటంకం ఏముందని.. ఎవరిపని వారు చేసుకుంటారని.. ఎందుకీ వాయిదా అనే డౌట్ ఎక్కువ మందికి వస్తోంది. కానీ ఏపీలో అంతే అని సర్దుకోవాల్సిందేనని నిట్టూరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close