ఆ అధికారుల బదిలీనే మొదటి సమస్య..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి,ఎస్‌ఈసీ మధ్య తొలి సమస్య అధికారుల బదిలీ దగ్గరే వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరవాత వ్యవస్థ పూర్తిగా ఎన్నికల సంఘంచేతుల్లోకి వస్తుంది. నిష్ఫాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆయన చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే.. రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుంది. ప్రభుత్వం అండ చూసుకుని అమలు చేయకపోతే భవిష్యత్‌లో అవి రిమార్కులుగా ఉండే అవకాశంఉంది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, ఏకగ్రీవాల్లో ఆరోపణల కారణంగా… కొంత మంది అధికారుల్ని ఎస్‌ఈసీ బదిలీ చేశారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో.. గుంటూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీ, పలువురు సీఐలపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ .. సిఫార్సు చేశారు. వీటిని సీఎస్ అమలు చేయలేదు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కింద అధికారులంతా పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను 24 గంటల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘించటం రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆదేశాలను తిరస్కరించటం అవుతుంది. గతంలో ఎస్‌ఈసీ ఆదేశాలను అప్పటి సీఎస్ నీలం సహాని తిరస్కరించారు. అమలు చేయలేదు. ఎన్నికలు వాయిదా పడటం.. కోడ్ ఎత్తివేయడం వల్ల.. అధికారుల బదిలీ గురించి పెద్దగాఎవరూ పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు మళ్లీ కోడ్ అమల్లోకి వచ్చింది. తాను అప్పుడు చెప్పిన అధికారులను ఇప్పుడు బదిలీ చేయాలని..ఎస్‌ఈసీ రమేష్ కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో… కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగామారింది. అసలుఎన్నికల ప్రక్రియే వద్దని ఆయన లేఖలు రాస్తున్నారు. ఆయన పేరుతో జారీ అవుతున్న జీవోల్లో.. రాజకీయభాష ఉంటోంది. ఇలాంటిపరిస్థితుల్లో ఆయన కూడా ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం… ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న చర్చ మాత్రం.. అధికారవర్గాల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close