మెరుగుపడని ఏపీ మంత్రి ఆరోగ్యం..ముంబైకి తరలింపు !

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబై తరలించారు. వైఎస్ఆర్ వర్థంతి రోజున ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కావడంతో కాకినాడలో చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించారు. అయితే మంత్రులంతా సహజంగా అయితే అపోలో ఆస్పత్రికి లేకపోతే ఏఐజీ ఆస్పత్రిలో చేరుతారు. కానీ ఆయనను సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. అదేమీ పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి కాదు. లోటస్ పాండ్‌కు వెళ్లే దారిలో ఓ చిన్న భవనంలో ఉంటుంది. ఆ ఆస్పత్రిలోనే జగన్ కోడికత్తి గాయానికి చాలా రోజుల పాటు వైద్యం చేయించుకున్నారు.

ఆ ఆస్పత్రి పెద్ద డాక్టర్ కం యజమానికి.. ఏపీలో ప్రభుత్వం రాగానే వైద్య రంగానికి సంబంధించిన మంచి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యులెవరూ ఆ ఆస్పత్రిలో చేరలేదు. కానీ పినిపె విశ్వరూప్‌ను అక్కడికే పంపించారు. ఆయనకు చాలా చిన్న అనారోగ్యమేనని నయమైపోయిందని తర్వాత ఆస్పత్రి ప్రకటన చేసింది. ఆయనను ఇంటికి పంపేశారని చెప్పుకున్నారు.

కానీ ఇటీవల కేబినెట్ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఆరోగ్యం రోజు రోజుకూ దిగజారిపోతూండటంతో నిపుణుల సలహా మేరకు ముంబై తరలించారు. ఆయనకు వచ్చిన అనారోగ్యం ఏమిటన్నదానిపై పూర్తి విరవాలు బయటకు తెలియనివ్వలేదు. ముంబై తరలించిన విషయం కూడా ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close