రాజాసింగ్ ఇక తమకు వద్దని తేల్చేసిన బీజేపీ !

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా వదులుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను సస్పెండ్ చేసిన బీజేపీ ఇప్పటి వరకూ దాన్ని తొలగించలేదు. ఆయన సస్పెండెడ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. పదే పదే తన సస్పెన్షన్ తొలగించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా ఆయనపై బీజేపీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలోనే కేసు నమోదు చేశారు. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.

ముంబై ర్యాలీలో పాల్గొన్న ఇతర బీజేపీ నాయకులు వివాదాస్పదంగా మాట్లాడకపోయినా, రాజా సింగ్ మాత్రం దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు ప్రసంగంలో ‘లవ్-జిహాద్’ గురించిమాట్లాడారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని నేను ప్రతి హిందువును కోరుతున్నానని చెప్పుకొచ్చారు.
రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా విమర్శలు రావడంతో పోలీసులు చివరికి కేసు పెట్టారు. నెలన్నర తర్వాత కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇక బీజేపీ కూడా రాజాసింగ్‌తో సమస్యేనని వద్దనుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close