బండి వర్సెస్ ఈటల – బీజేపీలో ముదురుతున్న వివాదం !

తెలంగాణ బీజేపీలో కనిపించని సంక్షోభం అంతకంతకూ పెరిగిపోతోంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనేది బయటకు కనిపిస్తోంది. తనకు తిరుగులేని బండి సంజయ్ అనుకుంటున్నారు. కానీ ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా నేరుగా కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఆయనకు ధీటైన నేతను తానేనని ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం చాలెంజ్‌ల బాట ఎంచుకున్నారు. గజ్వేల్లో తనకు తానే టిక్కెట్ ప్రకటించుకున్నారు. కేసీఆర్‌పై పోటీ చేయబోయేది తానేనని చెప్పుకున్నారు.

ఆ టెంపోను అలా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. కేసీఆర్ హుజూరాబాద్ వచ్చి పోటీ చేసినా పర్వాలేదన్నారు. ప్లేస్ ఆయనే డిసైడ్ చేసుకోవాలని..ఆయనను ఓడించేది తానేనని అంటున్నారు. ఈటల హడావుడి చూసి.. కేసీఆర్‌తో ఈటల తలపడుతున్నారన్న అభిప్రాయం వచ్చేలా ఉండటంతో బండి సంజయ్ ఉలిక్కి పడ్డారు. వెంటనే ఆయన ఈటల తీరును పరోక్షంగా ఖండించారు. బీజేపీలో ఎవరికి వారు టిక్కెట్లు ప్రకటించుకునే సంప్రదాయం లేదని.. తనకు కూడా కరీంనగర్, వేములవాడ, ఎల్పీనగర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ హైకమాండే టిక్కెట్లు ఇస్తుందన్నారు.

తనను ఉదాహరణగా చూపించుకున్నా.. బండి సంజయ్ అసలు టార్గెట్ చేసింది ఈటల రాజేందర్నేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఇటీవల హైకమాండ్ పిలిచి మాట్లాడింది. ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. కానీ చేరే వారే పెద్దగా కనిపించడం లేదు. ఈటల ద్వారా పార్టీలో చేరితే గుర్తింపు ఉండదన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఆ పార్టీలో చేరికలపై ప్రభావం చూపుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close