జగన్ రాజీనామా చేయడం కరెక్ట్ అంటున్న బీజేపీ నేత..!

వైఎస్ జగన్‌కు సిగ్గు,శరం ఉంటే రాజీనామా చేయాలని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సవాల్ చేస్తున్నారు. సీఎం జగన్‌ తీరును కేంద్రం గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన యాక్షన్ తీసుకుంటుందని ఆయన అంటున్నారు. కోర్టులను తప్పుబడితే సర్వనాశనం అవుతారు..జగన్‌కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. కోర్టులు ముక్కు పగిలేలా.. పళ్లు రాలేలా కొట్టినా సీఎంకు సిగ్గు లేదని… మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.. వైసీపీ నేతలు దోచుకుంటున్నారు.. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసు, డాక్టర్ సుధాకర్‌ కేసులను సీబీఐకి అప్పగించడం చూస్తుంటే.. ఏపీలో జగన్‌ పాలన ఉందో అర్థమవుతుందని తేల్చేశారు.

భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆదినారాయణ రెడ్డి సైలెంటయిపోయారు. ఎన్నికలకు ముందు రామసుబ్బారెడ్డితో రాజీ కారణంగా.. తనకు వచ్చిన ఎమ్మెల్సీ సీటును.. తన సోదరుడి కుమారుడికి ఇచ్చారు. ఆయన వైసీపీకి మద్దతుగా మారిపోయారు. అయినప్పటికీ..ఆదినారాయణరెడ్డి.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్మోహన్ రెడ్డిపై ఫైరవుతున్నారు. గతంలో ఆయన వైసీపీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. టీడీపీలోకి ఫిరాయించి మంత్రిగా పదవి పొందారు. దాంతో జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అయ్యారు.

ప్రభుత్వం మారిన తర్వాత వివిధ రకాల ఒత్తిళ్లు రావడం..క్యాడర్ ను కాపాడుకోవడానికి తప్పనిసరి కావడంతో… బీజేపీలో చేరిపోయారు. అయినా.. ఆయన జగన్ పై వ్యతిరేకతతో ఉన్నారు. కోర్టులు తప్పు పట్టేలా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని… బీజేపీ నేతలు ఎవరూ పెద్దగా విమర్శలు చేయడం లేదు..కానీ ఆదినారాయణరెడ్డి మాత్రం.. నేరుగా రాజీనామా డిమాండ్ నే వినిపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close