ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా వాదిస్తున్నారు. ఎక్కడ చూసినా మోడీ నామస్మరణతోనే బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అడుతున్నారు. కానీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో మోడీ వేవ్ లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం భాగంగా బీజేపీ శ్రేణులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, ఈసారి మోడీ వేవ్ లేదని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో మోడీ ఛరిష్మా పని చేసిందని ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదని వెల్లడించింది.

నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో మోడీ వేవ్ లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్సీపీ మద్దతుతో గెలుపొందారు. తర్వాత బీజేపీలో చేరిన ఆమె ఈసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతగా ఆమె మోడీ హావా లేదని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివరణ ఇచ్చుకుంది.

తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని.. మోడీ సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి నవనీత్ కౌర్ వ్యాఖ్యలు కొట్టిపారేసేలా ఏమి లేవని అంటున్నారు విశ్లేషకులు. సౌత్ లో మోడీ వేవ్ లేదని..అదే విషయాన్నీ ఆమె స్పష్టం చేసిందంటున్నారు. కానీ, ఆమె వ్యాఖ్యలు పార్టీకి కొంత ఇబ్బందికి గురి చేసేవే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close