బీజేపీ ఏదనుకుంటే అదే వాస్తవమా..? మిగతా అన్నీ ఫేకా..?

సోషల్ మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ విషయంలో కేంద్రం చాలా సీరియస్‌గా ఉంది. తాము చెప్పిన ట్విట్టర్ అకౌంట్లు బ్యాన్ చేయడం లేదని ఇప్పటికే… చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపుతున్నారు. అయితే ట్విట్టర్ ఏ మాత్రం లొంగడం లేదు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో అసహనం పెరిగిపోతోంది. సోషల్ మీడియా కంపెనీలు ఇక్కడ స్వేచ్చగా వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించవచ్చు కానీ.. తాము చెప్పినట్లుగా చేయాల్సిందేనన్న సంకేతాలను… పార్లమెంట్ వేదికగా రవిశంకర్ ప్రసాద్ పంపించారు. లేకపోతే… సహించబోమన్నారు.

రైతు ఉద్యమం సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ ప్రచారం జరుగుతోంది. ఆ పాజిటివ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం… అసహనానికి గురవుతోంది. వాటన్నింటినీ ఫేక్ న్యూస్‌గా స్పష్టం చేసి.. అలాంటి ట్వీట్లు ప్రచారం చేస్తున్న అకౌంట్లను బ్యాన్ చేయాలని కోరుతోంది. అయితే స్వంతంగా నిజ నిర్ధారణ చేసుకుంటున్న ట్విట్టర్ అంత తేలిగ్గా తాము అకౌంట్లను తొలగించబోమని స్పష్టం చేసింది. దీంతో కంపెనీలతో పాటు.. సోషల్ మీడియా యూజర్లపైనా ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. త‌ప్పుడు వార్తల‌ను వ్యాపింప‌ జేయ‌డానికి, హింస‌ను ప్రేరేపించ‌డానికి సోష‌ల్ మీడియాను దుర్వినియోగం చేస్తే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్‌లోనే హెచ్చరించారు.

నిజానికి ఫేస్ బుక్‌తో కేంద్రానికి ఎలాంటి పంచాయతీలు లేవు. ఫేస్ బుక్.. కేంద్రం చెప్పినట్లుగా అకౌంట్లన్నింటినీ ఫిల్టర్ చేస్తుంది. బీజేపీకి ఫేవర్‌గా ఏం చేయమన్నా.. చేస్తుంది. గతంలో జరిగింది అదే. పైగా ఫేస్ బుక్ ఇప్పుడు.. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో వాటా కూడా కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్‌పైనే కేంద్రం ఆగ్రహం కనిపిస్తోంది. అయితే అసలు ఇక్కడ సమస్య అంతా.. కేంద్రం చెబుతున్న ఫేక్ న్యూస్‌తోనే వస్తోంది. చాలా వరకూ కేంద్రం నిజాలను… ఫేక్‌గా భావిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్న వన్నీ… ఫేక్‌గానే చెబుతోంది. అక్కడే సమస్య వస్తోంది. నిజాలను దాచే ప్రయత్నం ట్విట్టర్ చేయడం లేదు. ట్విట్టర్‌పై బ్యాన్ విధిస్తే.. ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు అవుతుంది. అందుకే కేంద్రం యూజర్లపై హెచ్చరికలకు దిగింది.

నిజానికి ఇండియాలో ఇప్పుడు తీవ్రమైన నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి అధికారాలు పొందిన వాళ్లు కూడా… ఇప్పుడు అదే సోషల్ మీడియాను ఇతరులు తమకు వ్యతిరేకంగా ఉపయోగిస్తే సహించలేకపోతున్నారు. కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా.. అదే పని చేయబోతోందన్న సంకేతాలు పంపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close