త్యాగ‌శీలివ‌య్యా బోయ‌పాటి…

సింహా, లెజెండ్ చిత్రాల‌తో నంద‌మూరి అభిమానుల్ని మెప్పించాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఇప్పుడు స‌రైనోడుతో మెగా క్యాంప్‌లోనూ అడుగుపెట్టాడు. ఆ సినిమా కూడా హిట్టు కొట్టేసింది. బోయ‌పాటి సినిమాల్లో ది బెస్ట్ గా నిలిచింది. ఓవ‌రాల్ గా ఈ సినిమా రూ.70 కోట్ల వ‌ర‌కూ సాధించింది. ఇలాంటి భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కొట్టిన త‌ర‌వాత మ‌రో స్టార్ హీరోతో సినిమా చేయాలి. కానీ.. బోయ‌పాటి మాత్రం బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. అందుకు సంబంధించిన క‌థ కూడా లాక్ అయిపోయింది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమాప‌ట్టాలెక్క‌బోతోంది.

అయితే ఈలోగా బోయ‌పాటికి బోల్డ‌న్ని ఆఫ‌ర్లు వ‌రుస క‌డుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ‘మాతో సినిమా చేస్తారా’ అని అడుగుతున్నార్ట‌. అయ‌తే బోయ‌పాటి మాత్రం ‘బెల్లం కొండ‌తో సినిమాపూర్త‌వ్వాలి’ అని చెబుతున్న‌ట్టు టాక్‌. స‌రైనోడుకి బోయ‌పాటి రూ.6 కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకొన్నాడు. బెల్లంకొండ సినిమాకి రూ.10 కోట్ల వ‌ర‌కూ గిట్టుబాటు అయ్యింది. కేవ‌లం పారితోషికం కోస‌మే బోయ‌పాటి ఈ సినిమా చేస్తున్నాడ‌నుకోవ‌డానికి వీల్లేదు. ఇప్పుడు బోయ‌పాటికి అడిగినంత పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లూ రెడీగా ఉన్నారు. పైగా స్టార్ హీరోతో సినిమా చేస్తే వ‌చ్చే మైలేజీ వేరు. స‌రైనోడు కంటే ముందే బెల్లంకొండ‌కు మాట ఇవ్వ‌డం వ‌ల్ల ఈ సినిమా తీయాల్సివ‌స్తోంది. ఒక‌వేళ బోయ‌పాటి నాకు కొంచె టైమ్ కావాలి.. అని అడిగినా నిర్మాత‌లు అర్థం చేసుకొంటారేమో. కానీ బోయ‌పాటి మాత్రం ఏదోలా ఈసినిమాని గ‌ట్టెక్కించేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నాడు. పారితోషిం ఇస్తామ‌న్నా.. ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ రోజుల్లో మాట మీద నిల‌బ‌డి.. సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న బోయ‌పాటి లాంటివాళ్లు ఎంత‌మంది ఉంటారు చెప్పండి. ఆ విష‌యంలో ఈ మాస్ ద‌ర్శ‌కుడు గ్రేటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close