చంద్రులిద్దరూ సీమకు ద్రోహం చేశారన్న బైరెడ్డి

హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ రాయలసీమకు ద్రోహమే చేశారని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హైదరాబాద్‌ను లాక్కున్నాడని, హైదరాబాద్ అభివృద్ధిలో రాయలసీమవాసుల కృషికూడా ఉందని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ సీమవాసులను మోసంచేసి చంద్రబాబు నూతన రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాలలో పెట్టాడని అన్నారు. బైరెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన జరుగుతున్న 22వ తేదీ రాయలసీమ వాసులకు చీకటి దినం అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సీమ వాసులు రాయలసీమ ద్రోహులని వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలుగా అన్నిఅంశాలలో సీమకు అన్యాయమే జరుగుతోందని, దీనిని చంద్రబాబునాయుడు కొనసాగించారని చెప్పారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో బాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని అన్నారు. చంద్రబాబు సొత్తయినట్లు రాజధాని నిర్మాణానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ దుర్వినియోగంపై పిల్ వేస్తామని బైరెడ్డి చెప్పారు. మొత్తంమీద రాయలసీమలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని బైరెడ్డి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close