టీడీపీ హయాంలో టీటీడీ ఖర్చులపై కాగ్ ఆడిట్..!

టీడీపీ హయాంలో టీటీడీలో నిధులు దుర్వినియోగం జరిగాయని కాగ్‌తో విచారణ చేయించాలని… ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా జరిగే టీటీడీ ఆడిట్ ఇకపై కాగ్ ద్వారా జరిపేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాలకమండలి ఏపీ ప్రభుత్వానికి సిపార్స్ చేసింది. 2014-19 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని ఇప్పటికే ఎంపీ సుబ్రమణ్యస్వామి, సత్యపాల్ సభర్వాల్ వంటి వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కారణంగా 2014-20 వరకు ఇప్పటికే స్టేట్ ఆడిట్ డిపార్టుమెంట్ ఆడిట్ నిర్వహించినప్పటికీ దీనిపై కూడా కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది. ఏటా స్టేట్ ఆడిట్ ద్వారా సక్రమంగా ఆడిట్ జరుగుతున్నప్పటికీ అనవసర ఆరోపణల వల్స భక్తుల్లో విశ్వాసం కల్పించేందుకు గాను కాగ్ ద్వారా ఆడిట్ జరపాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ..నిధుల దుర్వినియోగం చేశారని..విచారణ చేయిస్తామని చాలా సార్లు ప్రకటనలు చేశారు.

కానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిధుల దుర్వినియోగం అంటూ జరిగితే.. ఆడిట్‌లో తేలిపోతుంది. కొత్తగా కాగ్ కూడా.. ఆ లెక్కలనే అడిట్ చేస్తుంది. ఒక్క టీడీపీ హయానికే కాకుండా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాగ్ ఆడిట్ చేయిస్తే..టీటీడీపై విమర్శలు రాకుండా ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close