కేసీఆర్‌కు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్..!

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఓ రకంగా న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు. కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకూ కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సమస్యలన్నీ తిరిపోయినట్లయ్యాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న స్థలంలో కట్టాలనుకున్న భవనానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడం కష్టమన్నచర్చ జరిగింది. దానికి తగ్గట్లుగానే కేంద్రం ఆ దరఖాస్తును పెండింగ్‌లో పెట్టింది. టెండర్లు పూర్తయినా ఈ కారణంగానే నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడు.. ఆ సమస్య తీరిపోయింది.

కేసీఆర్ కొత్త సచివాలయం కట్టాలని ఏళ్ల నుంచి అనుకుంటున్నారు.. కానీ రకరకాల కారణాలతో సాధ్యం కావడం లేదు. మొదట్లో స్థలం కోసం.. తర్వాత కోర్టు చిక్కుల వల్ల పెండింగ్ పడిపోయింది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీకి చెందిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడంతో స్థలం సమస్య తీరిపోయింది. అన్నింటినీ కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలనుకునే సమయానికి కోర్టు కేసులువచ్చాయి. చివరికి అన్నింటినీ అధిగమించి కూలగొట్టారు. ఇక ఏ అడ్డంకి లేదనుకుని టెండర్లు పిలిచి డిజైన్లు ఖరారు చేసి.. రెడీ అయ్యారు. ఈ లోపు పర్యావరణ అనుమతుల సమస్య వచ్చింది. మిగతా అనుమతులన్నీ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి కానీ.. పర్యావరణ అనుమతులు మాత్రం కేంద్రం ఇవ్వాల్సిందే.

కేంద్రంతో నిన్నామొన్నటిదాకా సఖ్యత లేదు. కొత్త సచివాలయానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో పడ్డాయి. అయితే.. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన పాలసీ మార్చుకున్నారు. దీంతో.. ఢిల్లీ కూడా తన పాలసీ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా పర్యావరణ అనుమతులు మంజూరు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close