ఏపీలోనూ రైతులకు నగదు బదిలీ..! కౌలురైతులకు కూడా..!

ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా.. నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌లో నిర్మయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం “రైతుబంధు” పేరుతో.. ఓ పథకాన్ని రైతులకు పెట్టుబడి సాయం కోసం అమలు చేస్తోంది. ఆ తరహాలోనే.. పలు రాష్ట్రాలు పథకాలను ప్రారంభించాయి. అయితే.. ఆ పథకంలో ఉన్న లోపాలను సవరించి… ఏపీలో… వినూత్నంగా అమలు చేయబోతున్నారు. కౌలు రైతులందరికీ.. సాయం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు రైతుల కన్నా.. కౌలు రైతులే ఎక్కువన్న లెక్కలు ఉన్నాయి.

ఈ కారణంగా కౌలు రైతులకు సాయం అందకపోతే.. పథకం ఉద్దేశం నెరవేరదని భావిస్తున్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో బ్యాంకులతో రుణాలిప్పించడానికి.. ఈ కార్డులు మంజూరు చేశారు. వీటిని అన్ని జిల్లాల్లో మంజూరు చేస్తారు. ఖరీఫ్‌ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం పూర్తిగా నగదు బదిలీ రూపంలోనే ఉంటుంది. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. రుణమాఫీ పొందిన కుటుంబాలన్నింటికీ.. ఇది వర్తించే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల పరంపరలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను.. వెల్లువలా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే.. పెన్షన్లు రెట్టింపు చేశారు. డ్వాక్రా మహిళలకు రూ. పదివేలు, స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు నేరుగా.. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ సంక్షేమం ఓట్ల వర్షం కురిపిస్తుందన్న ఆశాభావంతో… టీడీపీ వర్గాలు ఉన్నాయి. నిజానికి.. కేంద్ర ప్రభుత్వం కూడా… రైతుల కోసం.. ఓ నగదు బదిలీ పథకం పెట్టబోతోందని చెబుతున్నారు. అదే జరిగితే రైతులకు మరింత మేలు జరగనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close