చంద్రబాబు వర్సెస్ జగన్..! “ప్రజావేదిక” కోసం కుస్తీ షురూ..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చింది. వారం రోజుల పాలన ముగిసింది. ఇప్పటికైతే.. ప్రతిపక్ష పార్టీగా మారిన అధికారపక్షం.. ఆరు నెలల పాటు సంయమనం పాటించాలని అనుకుంటోంది. కానీ..అధికారపక్షంగా మారిన ప్రతిపక్షం వైసీపీ మాత్రం.. సందర్భం సృష్టించుకుని మరీ టీడీపీపై దాడి చేస్తోంది. విజయసాయిరెడ్డి ట్వీట్లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందుల్లాంటి చోట్ల నేరుగా జగనే టీడీపీపై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో.. రెండు పార్టీలు ముఖాముఖి తలపడాల్సిన పరిస్థితి అప్పుడే వచ్చింది.

“ప్రజావేదిక” కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు..!

అమరావతి రాజధానిగా మార్చిన తర్వాత చంద్రబాబు.. ఉండవల్లిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఆ ఇల్లు… లింగమనేని ఎస్టేట్స్‌కు చెందినది. దానికి ఆయన అద్దె చెల్లిస్తున్నారు. అది ప్రైవేటు ఆస్తి. అయితే.. ముఖ్యమంత్రి నివాసానికి అనుబంధంగా.. ఓ కట్టడాన్ని నిర్మించారు. కీలకమైన సమావేశాలన్నీ.. చంద్రబాబు అందులోనే నిర్వహించేవారు. ప్రభుత్వమైన.. పార్టీ పరమైనా… అధికారులు, పార్టీ నేతలతో.. అక్కడ భేటీ అయి.. పనులు చక్క బెట్టేవారు. దానికి “ప్రజావేదిక” అని పేరు పెట్టారు. అయితే.. దాన్ని నిర్మించింది… మొత్తం ప్రభుత్వ సొమ్ముతోనే. అందుకే.. ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత చంద్రబాబు నాయుడు.. ఆ ప్రజావేదికను ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించాలని లేఖ రాశారు. అయితే.. సాయంత్రానికి వైసీపీ… నేత తలశిల రఘురాం నేరుగా.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి.. ఆ ప్రజావేదికను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేటాయించాలని.. లేఖ ఇచ్చారు. పోటాపోటీ లేఖలతో ఒక్క సారిగా ప్రజావేదిక అంశం తెరపైకి వచ్చింది.

అక్రమ కట్టడమని వాదించిన వైసీపీ..! ఇప్పుడెందుకిలా..?

నిజానికి కృష్ణా నది ఒడ్డున.. నిబంధనలకు విరుద్ధంగా.. చంద్రబాబు నివాసం ఉందని.. దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉందని.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలను ఉల్లంఘిచారని.. గతంలో వైసీపీ ఆరోపణలు చేసింది. తాము వస్తే కూలగొడతామని కూడా పలువురు వైసీపీ నేతలు హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటి వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆయన .. రెండో సారి గెలిచిన తర్వాత .. కరకట్ట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగి… అక్రమ కట్టడాలను నోట్ చేసుకున్నారు. అందులో ఉండవల్లిలోని సీఎం నివాసం కూడా ఉంది. కూలగొట్టడానికి సిద్ధమవుతున్నారని అనుకునేలోపు.. ఆ ప్రజావేదికను నేరుగా.. సీఎంగా జగన్‌కే కేటాయించాలని కోరడం ఆశ్చర్యకరమే.

ప్రతిపక్ష నేతకు ఇవ్వకూడదనే వైసీపీ గేమ్ ప్లానా..?

ప్రతిపక్షనేతకు .. ప్రభుత్వం అమరావతిలోనే ఇల్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పుడు తాను ఉంటున్నది ప్రైవేటు వ్యక్తులది కాబట్టి… దానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను మాత్రం … ఇల్లుగా గుర్తించి.. కేటాయించాలని చంద్రబాబు కోరారు. అలా ఇవ్వడం వైసీపీకి ఎంత మాత్రం ఇష్టం లేదని.. తాజా పరిణామాలతో స్పష్టమయింది. మామూలుగా అయితే.. దీన్ని పెద్ద వివాదాస్పదం చేసే అవకాశం ఉండేది కాదు. కానీ.. ఆ పార్టీ నేతలు.. దాన్ని సీఎంకే కేటాయించాలని లేఖ ఇవ్వడంతో.. చంద్రబాబుకు ఇచ్చే ఉద్దేశం లేదని.. అందుకే… సీఎస్‌కు లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అదే నిజమైతే.. ప్రజావేదికను చంద్రబాబు వాడుకునే అవకాశం ఉండదు.

జగన్‌కూ కేటాయించే అవకాశం లేదు..!

సీఎం హోదాలో సమీక్షలు చేయడానికి.. జగన్‌కు ఆ ప్రజావేదిక కావాలని వైసీపీ నేతలు సీఎస్‌కు లేఖ ఇచ్చినప్పటికీ… జగన్ దాన్ని తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. పక్కనే … ఆ ప్రజావేదికకు అనుబంధంగా చంద్రబాబు నివాసం ఉంది. అది ప్రైవేటుది. అందులో చంద్రబాబు ఉండగా… పక్కనే జగన్మోహన్ రెడ్డి సమీక్షలు చేయడం అసలు ఊహించలేము. చంద్రబాబుకు ఇవ్వకూడదన్న పంతానికి పోయి.. వేరే వారికి కేటాయించే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close