ఎంతవారులైనా పబ్లిసిటీ దాసులే. సినిమా అయినా, టీవీ పోగ్రాం అయినా, స్టార్ అయినా, కొత్త హీరో అయినా… పబ్లిసిటీ అంటూ ప్రదక్షిణాలు చేయాల్సిందే. ఈ విషయం ముఫ్ఫై ఏళ్లుగా ఇండ్రస్ట్రీని ఏలుతున్న చిరంజీవికి తెలియంది కాదు. అందుకే.. పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకొంటున్నాడు చిరు. అప్పుడే ఆ హంగామా కూడా మొదలైపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు సరికొత్త వెర్షన్కి చిరు హోస్ట్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోని మాటీవీ కూడా విడుదల చేసింది. అది చూస్తే సినిమా టీజర్కు ఏమాత్రం తగ్గని లెవిల్లో, మెగాస్టార్ స్థాయిలోనే ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంకి ముందు నుంచీ భారీగా ప్రమోషన్లు జరుగుతూనే ఉన్నాయి. హోస్ట్ చిరు కాబట్టి, ఆ జోరు ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. చిరు కూడా.. ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాడట.
మరోవైపు ఖైదీ నెం.150 ప్రచారం కూడా మొదలైపోయింది. సినీ వారపత్రికల కోసం ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్ నిర్వహించి స్టిల్స్ పంపించారు. ఇప్పుడు డైలీ పేపర్ల వంతు వచ్చింది. డైలీ పేపర్లలో ప్రమోషన్ల కోసం మరో ఫొటో షూట్ నిర్వహించారని తెలుస్తోంది. త్వరలో అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు విడుదల చేసే అవకాశం ఉంది. పబ్లిసిటీ విషయంలో స్వయంగా చిరంజీవినే రంగంలోకి దిగారని సమాచారం. ఏయే పత్రికకు ఎన్ని స్టిల్స్ పంపాలి? అనేది కూడా చిరునే డిసైడ్ చేస్తున్నాడట. కనీసం వారానికి ఒకసారి ఖైదీ నెం.150కి సంబంధించిన ఓ స్పెషల్ న్యూస్ మీడియాలో స్ప్రెడ్ అయ్యేలా చూడమని పీఆర్కి సూచించాడట చిరు. మరోవైపు రామ్ చరణ్ కూడా చిరు సినిమాని ప్రత్యేక దృష్టితో చూస్తున్నాడు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసే మార్గాల అన్వేషణలో పడ్డాడు చరణ్. ఇటీవల చరణ్ ప్రమోషన్ల కోసమే ఓ టీమ్ని సెట్ చేశాడు. వాళ్లు చిరు సినిమా ప్రమోషన్లలోనూ భాగం పంచుకొంటారని తెలుస్తోంది.