చిరంజీవి 150వ సినిమాకి అప్పుడే రిపేర్లు మొదలైపోయాయా? కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవీ.. ఓం ప్రధమంగా తీసిన సన్నివేశాలట. వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. జోరుగా షూటింగ్ సాగుతోంది. తొలుత చిరంజీవి, అలీలపై కొన్ని హాస్య సన్నివేశాల్ని తెరకెక్కించారు. వాటి ఫుటేజ్ అంత సంతృప్తికరంగా లేదట. దాంతో చిరంజీవి డైలామాలో పడినట్టు తెలుస్తోంది. దానికి తోడు… సునీల్ ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయించాడు. అలీతో తెరకెక్కించిన సీన్లు ఇప్పుడు సునీల్ తో రీషూట్ జరిపించాలని చిత్రబృందం నిర్ణయించుకొందని సమాచారం.
నిజానికి అలీ పాత్ర చేయమని ముందు సునీల్నే అడిగారు. అయితే ఆ సమయంలో జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నాడు సునీల్. ఇప్పుడు మరో పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. ఆ పాత్ర అలీకి షిఫ్ట్ చేసి, అలీ చేసిన క్యారెక్టర్ సునీల్కి అప్పగించి… ఇప్పటి వరకూ తీసిన సన్నివేశాల్ని రీషూట్ చేయాలని భావిస్తున్నార్ట. వీటి సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తున్నార్ట. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిరు వ్యూహం. ఇలా రిపేర్లు చేసుకొంటూ పోతే… సంక్రాంతికి రావడం కలే…