వాలంటీర్లపై చేసిన ఆరోపణలకు పవన్‌ను సాక్ష్యాలడిగిన చిత్తూరు ఎస్పీ !?

ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. పవన్ కల్యాణ్‌కు చిత్తూరు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా చూపించారు. సైకో పోలీస్ గా విమర్శలు ఎదుర్కొంటున్న అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు పవన్ కు సమయం ఇచ్చిన ఆయన… ఆ సంగతి ఏమీ చెప్పకుండా… ఇటీవల్ల వాలంటీర్ వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ ను వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసు వ్యవస్థకు సమర్పించాలని ఎస్పీ కోరారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు కూడా పెట్టారు. ఆయనపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో… నేరుగా పోలీసుల వద్దకే వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడంతో… ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయన వద్ద వివరణ కోసం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పవన్ ఏం సమాధానం ఇచ్చారో స్పష్టత లేదు. కానీ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తీరుపై జనసైనికులు మండిపడుతున్నారు.

తప్పు చేసిన పోలీసు అధికారిని.. రాజకీయ కారణాలతో వెనుకేసుకు వచ్చి వారిని మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నారని. .. అదే రాజకీయంతో ఎస్పీలు కూడా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ వివరణ అడగడం ఏమిటని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసిన తర్వాత సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకుంటున్నట్లుగా లీకులు ఇచ్చారు. కానీ అదేమీ లేదు.. కేవలం ఓ చార్జ్ మెమో ఇచ్చి సరి పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close