ఇదేదో బూతు సినిమాలా ఉందే…

జ‌బ‌ర్‌ద‌స్త్ గ్యాంగ్‌లో ధ‌న్‌రాజ్ ఒక‌డు. ఆ షో పుణ్య‌మా అని తాను కూడా పాపుల‌ర్ అయ్యాడు. ఇంకాస్త పాపుల‌ర్ అవుదామ‌న్న ఉద్దేశం క‌లిగిందేమో.. ప‌నిలేని పులిరాజు అంటూ ఓ సినిమా మొద‌లెట్టాడు. అది పూర్త‌య్యింది.. విడుద‌ల‌కూ రెడీగా ఉంది. ధ‌న్‌రాజ్‌, ర‌ఘుబాబులు త‌ప్ప తెలిసిన మొహాలేం క‌నిపించ‌డం లేదు. కాక‌పోతే.. టైటిల్ కాస్త ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. దానికి తోడు ధ‌న్‌రాజ్ అంటే కామెడీ ఆశిస్తారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే… కామెడీ కంటే బూతు గోల ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ధ‌న్‌రాజ్ ఓసారి మ‌సాజ్ సెంటర్‌కి వెళ్లి.. అక్క‌డ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఆ ఎపిసోడ్‌ని కూడా ఈ సినిమాలో గుర్తు చేశాడు. ‘అన్ని మ‌సాజ్ సెంట‌ర్లూ ఒకేలా ఉండ‌వు’ అన్న డైలాగ్ కొట్టించి.. మ‌సాజ్ మ‌సాజ్ అంటూ ఓ ఐటెమ్ పాట వేసుకొన్నాడు. మ‌ర్చిపోయిన సంగ‌తికి కోరి కెలుక్కోవ‌డం ఎందుకో మ‌రి. పుల్ల‌కే పిల్ల‌లు పుట్టేస్తారా..? నువ్వు ఫ్రెష్ కాదా.. ఇలాంటి అడ‌ల్ట్ డైలాగులు ఈ టీజ‌ర్‌లో వినిపిస్తున్నాయి. మ‌రి సినిమాలో ఆ కంటెంట్ ఎంత వ‌ర‌కూ ఉంటుందో..! దానికి తోడు ధ‌న్‌రాజ్ డాన్సులు చేసి..నిజం హీరోల బిల్డ‌ప్పు ఇస్తున్నాడు. ఇవ‌న్నీ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close