హైదరాబాద్‌లో పట్టుబడుతున్న డబ్బులన్నీ ఒక్క పార్టీవే ?

హైదరాబాద్‌లో ప్రతీ రోజూ రూ. కోట్లలో నగదు పట్టుబడుతోంది. మూడ్రోజుల వ్యవధిలోనే సుమారు ఏడు కోట్ల రూపాయలకుపైగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మునుగోడు ఉపఎన్నిక కోసమే వెళ్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే పట్టుబడుతున్న డబ్బంతా ఒకే పార్టీది. నగదు తరలింపుపై ప్రత్యేకంగా నిఘా పెట్టి మరీ సోదాలు చేసి నగదును పట్టుకుంటున్నారని చెబుతున్నారు.

గతంలో దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఉపఎన్నికల్లో అదే జరిగింది. దుబ్బాక సమయంలో బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బు పదే పదే పట్టుబడింది. ఫోన్లు ట్యాప్ చేశారని రఘునందన్ ఆరోపించారు. ఇప్పుడూ బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మే ఎక్కువగా పట్టుబడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో హవాలా వ్యాపారులపై నిఘా పెట్టడం.. ఆ నగదును పట్టుకోవడం కామన్‌గా మారిపోయిందంటున్నారు.

సాధారణంగా ఎన్నికలు వస్తే హవాలా వ్యాపారులకు పండగే. కమిషన్లు తీసుకుని ఎంత కావాలంటే అంత నగదును కావాల్సిన చోటకు తరలిస్తారు. ఇప్పుడు వారికి సీజన్ ప్రారంభమయిందని అనుకోవచ్చు. సాధారణంగా డబ్బును రవాణా చేసే వారికి పూర్తి వివరాలు తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే వారు తీసుకెళ్తున్న బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయని కూడా తెలియదు. సినిమాల తరహాలో ఎవరికి అందించాలో అందించేందుకు మాత్రమే వారుంటారు. ఒక వేళ ఆ డబ్బులెవరివో తెలిసినా పెద్దగా పట్టించుకోరు. డబ్బును సీజ్ చేయడం వరకే హైలెట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close