వైసీపీ దళిత నేతలంతా కాంగ్రెస్ వైపే !

వైసీపీ దళిత నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. నంది కొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ లో చేరారు. వారు ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్‌ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు గౌరవం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. టిక్కెట్ ఇచ్చారు. పార్టీ వేదికలపై ఆయనకు మంచి గౌరవం లభించేది. అయితే మూడు రాజధానుల నాటకం సమయంలో .. డొక్కా కూడా తాను కన్నింగ్ పొలిటీషియన్‌నేనని నిరూపించారు. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా రాజీనామా అంటూ నాటకమాడి వైసీపీలో చేరిపోయి.. తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నికయ్యారు.

ఆయనను ఇప్పుడు టీడీపీలోకి కూడా ఎవరూ ఆహ్వానించడం లేదు. కాంగ్రెస్ లో విలువ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూసుకుంటున్నారు. షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close