వైసీపీలో కట్టుదాటుతున్ననేతల ఆధిపత్య పోరాటాలు !

కొండ నాలికకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లుగా మారింది వైసీపీ పరిస్థితి. వైఎస్ఆర్‌సీపీలో అన్ని జిల్లాలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోతున్నాయి. తమపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని.. బాలినేని, అనిల్ లాంటి మాజీ మంత్రులు కూడా మీడియాకు ఎక్కాల్సిన పరిస్థితి ఏర‌్పడింది. అటు కడప నుంచి ఇటు సిక్కోలు వరకూ వైసీపీలో ఎవరి పరిస్థితి ప్రశాంతంగా లేదు. అన్ని జిల్లాల్లోనూ నేతలు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుటున్నారన్న ఆరోపణలు ఎవరికి వారు చేసుకుంటున్నారు. అవి అంతకంతక పెరిగిపోతున్నాయి. దీనికి సీఎం జగన్ తీరు కూడా కారణం అవుతోంది. తాజాగా దర్శి ఎమ్మెల్యే వ్యాఖ్యలే దీనికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరాటం సాగుతోంది. దీంతో విభేదాలు పార్టీని బలహీనపరిచేలా ఉంటున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు వేచి చూస్తున్నారు. పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారు కూడా అధినేతకు చెప్పుకోలేక మీడియాకు ఎక్కుతున్నారు. హైకమాండ్ జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంపై తక్షణం దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నా.. వారు ఇతర పనులతో బిజీగా ఉన్నారు.

పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీ నేతలను ఒకరికొకరు దెబ్బతీసుకునే వ్యూహాలను కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతుల చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. వివాదాస్పద వీడియోలు వెలుగులోకి రావడానికి కూడా వైసీపీ నేతల అంతర్గత పోరాటమేనని చెబుతున్నారు.

ప్రస్తుతానికి వైసీపీ హైకమండ్ తాము ఏం చేయాలనుకుంటున్నామో అదే చేస్తున్నారు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close