ఆ 300 కోట్ల కంపెనీపై టీటీడీ కంగారు..! తెర వెనుక ఏం జరిగింది..?

రూ. 300 కోట్ల విరాళంతో తిరుపతిలో టీటీడీకి చిన్నపిల్లల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామని ముందుకు వచ్చిన ముంబై కంపెనీ వ్యవహారంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ కంపెనీ ఖాతాలో రూ. మూడు వందలు కూడా లేవని తేలింది. అలాంటి కంపెనీ ఎలా ఆస్పత్రి నిర్మాణం చేపడుతుందని… భక్తుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు సామర్థ్యం లేని కంపెనీని ఎలా నమ్మారని..ఎలా ఎంవోయూ చేసుకున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒప్పందం బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ టీటీడీ మాత్రం ఒప్పందం బయట పెట్టడం లేదు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. తెర వెనుక ఏం జరిగిందోనని చర్చోపచర్చలు వినిపిస్తున్నాయి.

రూ. మూడు వందల కోట్ల విరాళం ఇస్తామన్న ఉద్వేగ్ ఇన్‌ఫ్రా అనే ముంబై కంపెనీలో కొత్తగా తెలుగువాళ్లు డైరక్టర్లుగా చేరారు. ఆ కంపెనీకి ప్రత్యేకంగా వ్యాపారం లేదు. మూలధనం లేదు. ఆదాయం లేదు. అలాంటప్పుడు.. మూడు వందల కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తామనడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందని.. ఇదంతా పెద్దలకు తెలిసే జరుగుతోందని టీటీడీ ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు… ఆస్పత్రి కోసం అంటూ ఇవ్వడానికి సిద్ధమైన పది ఎకరాల భూమిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ భూమిని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సహజంగా ఉద్వేగ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను టీటీడీ వెంటనే క్లారిఫై చేయాల్సి ఉంది.కానీ చేయడం లేదు. ఆ సంస్థకు విదేశాల నుంచి నిధులు వస్తాయని… కడతారని నమ్మకం వ్యక్తం చేస్తోంది. విరాళాలు వద్దనలేమని.. భక్తుల సెంటిమెంట్ అని కబుర్లు చెబుతోంది. ఇక్కడే ఏదో దాస్తున్నారన్న అభిప్రాయం మాత్రం గట్టిగా ఏర్పడుతోంది. అసలు ఆ సంస్థ ఏమిటి. … ఏ ఉద్దేశంతో రూ. మూడు వందల కోట్ల విరాళం ఇవ్వాలనుకుంది.. ఎంవోయూలో ఏముంది.. ఇవన్నీ బయటకు తేలితే కానీ.. అసలు లెక్కపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close