ఈనాడు, జ్యోతి, టీవీ 5, టీడీపీ ఆరు గ్యారంటీలకు జగన్ రెడ్డి పబ్లిసిటీ !

జగన్ రెడ్డి బహిరంగసభలో ఈనాడు పేపర్ ను చూపించి అందులో ఏమున్నదో చదివి వినిపించారు. వెటకారం చేద్దామనో…. అందులో తప్పు రాశారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు కానీ.. ఆయన మాటలు విని.. ఈనాడును చూడని వైసీపీ వాళ్లకు స్వయంగా ఆయనే ఈనాడులో ఏమొస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఈనాడుకు ఇంత కన్నా కావాల్సింది ఏముంది ?. జగన్ రెడ్డి అలా స్టేజ్ మీద ఈనాడును చూపించడం వల్ల సాక్షి మాత్రమే చదవుతూ.. అదో లోకంలో ఉండిపోతున్నామని అనుకునే జగన్ రెడ్డి ఫ్యాన్స్ ఇక నుంచి ఈనాడు, జ్యోతిలు కూడా చదివే అవకాశం ఉంది. నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు ప్లస్ అవుతుంది.

ఈనాడు గురించి ఈ రోజు జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఆయన నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈనాడుపై ఎవరి అభిప్రాయం వారికి ఉంది. ఈనాడు చదవొద్దని.. జగన్ రెడ్డి ఎన్నో సార్లు పిలుపునిచ్చారు. కానీ ఆయనే చదువుతూ.. ఇందులో ఇలా వచ్చిందని.. ప్రజలకు చూపిస్తున్నారు. అంతేనా… మీకు తెలియని విషయాలు తెలియాలంటే.. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి, టీవీ 5 కూడా చూడాలన్నట్లుగా పిలుపునిస్తూ ఉంటారు.

కొత్తగా ఆయన ఆరు గ్యారంటీలకూ ప్రచారం చేస్తున్నారు. చింతపల్లి సభలో ఆరు గ్యారంటీల గురించి పక్కన వాళ్లను అడిగి మరీ తెలుసుని ప్రచారం చేశారు. తాము ఇస్తున్న దాని కన్నా మూడింతలు సంక్షేమం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవ్వలేరని మోసం చేస్తారని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చుకానీ.. ఏమీ చేయకుండా అప్పులు తెచ్చి బటన్ నొక్కేవాడే ఇస్తే… ఇక సంపద సృష్టించి ఇచ్చేవాళ్లు ఎందుకు ఇవ్వరని.. సందేహం ఎదురుగా కూర్చున్న వాళ్లకు వస్తుంది.

మొత్తంగా జగన్ రెడ్డి కూడా.. తమకు ప్రచారం.. నెగెటివ్ వేలో అయినా సరే తమ పథకాలను వైసీపీ క్యాడర్..సానుభూతి పరుల్లోకి తీసుకెళ్లడం వారికి హ్యాపీగా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close