టీఆర్ఎస్ వల్లే ఐసిస్ ఉగ్రవాదం: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో ఐసిస్ ఉగ్రవాదం ఉందని మంత్రి అన్నారు. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పూజిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిజామ్‌ను పొగుడుతోందని విమర్శించారు. ఉద్యోగావకాశాలు లేకపోవటంవల్లే యువత ఉగ్రవాదంవైపు చూస్తోందని అన్నారు. హైదరాబాద్ నల్లకుంటలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్త, చెదారం దర్శనమిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఫ్లెక్సీలపైనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని కిషన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన యువకులు కొందరు ఇటీవల ఐసిస్‌లో చేరటానికి వెళుతూ నాగపూర్‌లో పోలీసులకు చిక్కిన ఘటనపైనే కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. బొగ్గుగనుల కుంభకోణాన్ని వెలికితెచ్చిన నేతగా హన్స్‌రాజ్ గంగారామ్ ప్రసిద్ధులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close