వరదలకు వందల మంది బలి .. కదలని సీఎం జగన్ !

తిరుపతి, కడప జిల్లాల్లో వచ్చిన వరదలకు వందల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంది. రాజంపేట మండలం గుండ్లురు వద్ద బస్సు చెరువులో ఆగిపోయిన సమయంలో బస్సులో ఉన్న వారిలో కనీసం పదిహేను మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇరవై గంటల పాటు వారి గురించి పట్టించుకునేవారే లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అలాగే పుల్లూరు, మందపల్లి, పులత్తూరు గ్రామాల్లోనే కనీసం యాభై మంది చనిపోయారని ఎమ్మెల్యే అధికారికంగా చెప్పారు.

ఇంకా మొత్తం చూస్తే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బీభత్సమైన పరిస్థితి ఉంటే హెలికాఫ్టర్‌ను ఈ రోజు మధ్యాహ్నానికి పంపించారు. ఇప్పటికి జలదిగ్బంధంలోనే అనేక మంది ఉన్నారు. వారిని బయటకు తెచ్చే కార్యక్రమాలు చాలా స్లోగా సాగుతున్నాయి. తిరుపతిలో వరదల దృశ్యాలు చూసి చిరంజీవి కూడా ఆందోళన చెందారు. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో నదులు ఉద్ధృత రూపానికి ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం జగన్ తాడేపల్లి నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఓ సారి.. మధ్యాహ్నం ఓ సారి సమీక్షలు నిర్వహించి.. శిబిరాల్లోని వారికి రూ. రెండు వేలు, మృతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

ఏం కావాలన్నా అందుబాటులో ఉంటానని మీడియాకు చెప్పారు కానీ.. క్షేత్ర స్థాయిలో పర్యటనకు మాత్రం వెళ్లలేదు. బహుశా.. వరద అంతా శాంతించిన తర్వాత సీఎం ఏరియల్ వ్యూ చేసే అవకాశం ఉంది. ఏ సీఎం అయినా విపత్తులు జరిగితే కార్యక్షేత్రానికి వెళ్లి అధికారుల్ని అప్రమత్తం చేస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎప్పుడూ విపత్తులను సీరియస్‌గా తీసుకోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close