‘ఊపిరి’ చిత్రంలో నటించడం ‘సంతోషం’గా వుందంటున్న హీరోయిన్‌!

‘సోగ్గాడే చిన్ని నాయనా’తో సంక్రాంతి హిట్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున నెక్స్‌ట్‌ మూవీ ‘ఊపిరి’ అతని కెరీర్‌లో మరో డిఫరెంట్‌ మూవీ అవ్వబోతోంది. ది ఇన్‌టచ్‌బుల్స్‌ అనే ఫ్రెంచ్‌ మూవీకి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తన ఇమేజ్‌ని పక్కన పెట్టి వీల్‌చైర్‌కే పరిమితమయ్యే ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కార్తీ కూడా హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుష్క, అడవి శేష్‌, నోరా ఫతేహి, మోడల్‌ గాబ్రియల్‌ అతిథి పాత్రల్లో నటిస్తుండగా ‘సంతోషం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శ్రీయ ఈ చిత్రంలో మరో అతిథి పాత్రలో కనిపించబోతోంది. ‘ఊపిరి’లో నాగార్జున చేస్తున్న క్యారెక్టర్‌కి ఒరిజినల్‌ వెర్షన్‌లో హీరోయిన్‌ లేదు. కానీ, మన హీరోలకు హీరోయిన్‌ అవసరం కాబట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ను యాడ్‌ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీయ చెప్తోంది. పివిపి సినిమా పతాకంపై ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా మార్చి 25న విడుదల కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close