ఏపీ కరోనా టెస్టులను పరిగణనలోకి తీసుకోని ఐసీఎంఆర్..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము కరోనా టెస్టుల్లో దేశంలోనే నెంబర్ వన్ అని రోజూ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. రోజుకు ఐదు నుంచి ఎనిమిది వేల టెస్టులు చేస్తున్నట్లుగా వివరాలు ప్రకటిస్తూ ఉంటుంది. పది లక్షల మంది సగటును తీసుకుంటే.. తాము పదిహేను వందల మందికిపైగా టెస్టులు చేశామని ఘనంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. అయితే.. ఈ కరోనా వ్యవహారాల్ని మొత్తం డీల్ చేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. ఐసీఎంఆర్ మాత్రం… వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశంలో జరిగిన కరోనా టెస్టులపై ప్రకటన చేసిన ఐసీఎంఆర్… ఆంధ్రప్రదేశ్ ఇంకా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తేల్చేసింది.

దేశంలో పది లక్షల టెస్టుల మైలురాయిని దాటామని ఐసీఎంఆర్ తాజాగాఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం..మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు లక్షకుపైగా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈ రాష్ట్రాలు చురుగ్గా పరీక్షలు నిర్వహిస్తూ… వైరస్ సోకిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక , ఢిల్లీ రాష్ట్రాలు టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవడంలో వెనుకబడ్డాయని తేల్చింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ తాము లక్షకుపైగా టెస్టులు చేశామని అధికారికంగా ప్రకటించుకుంది. అధికారిక డాష్ బోర్డులోనూ చెప్పుకుంటోంది. కానీ ఐసీఎంఆర్ గుర్తించడం లేదు.

ఏపీ సర్కార్.. ఆర్టీ -పీసీఆర్ టెస్టులతోపాటు.. కొరియా నుంచి తెప్పించిన యాంటీ బాడీ కిట్లు..అలాగే ట్రూనాట్ కిట్లతో పరీక్షలు చేస్తోంది. ఐసీఎంఆర్.. ఒక్క ఆర్టీ-పీసీఆర్ టెస్టులను మాత్రమే.. పరిగణనలోకి తీసుకుంటోంది. అది ఒక్కటి మాత్రమే నమ్మదగిన పరీక్ష అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఆర్టీ- పీసీఆర్ పరీక్షల సామర్థ్యాన్ని పెద్దగా పెంచుకోలేదు. ఇప్పటికే ఇరవై నాలుగు గంటలూ పని చేస్తే.. పదిహేను వందల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయగలరు. అంతకు మించిచేయలేరు. అయినా.. పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటోంది. దీన్ని ఐసీఎంఆర్ లైట్ తీసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close