చెన్నైలో చేతులెత్తేసిన టీమిండియా

ఆస్ట్రేలియాని.. అందునా ఆ దేశంలో ఓడించి – నివ్వెర ప‌రిచిన టీం ఇండియా – స్వ‌దేశంలో ఇంగ్లండ్ పై చేతులెత్తేసింది. చెన్నైలోని తొలి టెస్టులో హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగిన భార‌త్‌… ఇంగ్లిష్ జ‌ట్టు చేతిలో.. 227 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. చివ‌రి రోజు.. వికెట్లు కాపాడుకోలేక త‌ల‌వొంచింది. ఫ‌లితంగా తొలి టెస్టులో భార‌త్ ఓట‌మి పాలైంది. టెస్టు మ్యాచ్ గెల‌వాలంటే చివ‌రి రోజు 381 ప‌రుగులు చేయాలి. ఓట‌మి త‌ప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 9 వికెట్ల‌తో చివ‌రి బంతి వ‌ర‌కూ పోరాడాలి. కానీ.. ఇవి రెండూ చేయ‌లేక‌పోయింది భార‌త్‌. ఒక వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగుల‌తో.. ఐదో రోజు పోరాటం ప్రారంభించిన భార‌త్‌కు.. ఆండ‌ర్స‌న్, జాక్ లీచ్‌ కోలుకోలేని దెబ్బ‌కొట్టారు. తొలుత పుజారా (15)ని లీక్ అవుట్ చేశాడు. అక్క‌డి నుంచి వికెట్ల ప‌త‌నం ప్రారంభ‌మైంది. గిల్ (50) ఆండ‌ర్స‌న్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవ‌ర్లో రెహానే (0) కూడా వెనుదిరిగాడు. అద్భుత‌మైన ఫామ్ లో ఉన్న పంత్ (11) ఈసారి.. వికెట్ల‌ని కాచుకోలేక‌పోయాడు. ఓ ద‌శ‌లో లంచ్‌కి ముందే భార‌త్ ఆలౌట్ అవుతుంద‌నిపించింది. అయితే.. కోహ్లి (72), అశ్విన్ (9) వికెట్ల ప‌త‌నాన్ని కాసేపు అడ్డుకున్నారు. వీళ్లు కూడా.. త్వ‌ర‌త్వ‌ర‌గా అవుటై పెవిలీయ‌న్ చేర‌డంతో భార‌త్ ఓట‌మి త‌ప్ప‌లేదు. చివ‌రికి 192 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. జాక్ కి 4, ఆండ‌ర్స‌న్‌కి 3 వికెట్లు ద‌క్కాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close