ఏపీలో యాప్‌ ద్వారా పోలీస్ సేవలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే ఓ కొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ పోలీస్‌ సర్వీస్‌ యాప్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లు ఈ యాప్‌కు అనుసంధానమై ఉంటాయి. అన్ని నేరాలపై కొత్త యాప్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరమే లేకుండా…87 రకాల సేవలను పోలీస్ సర్వీస్ యాప్ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై కొత్త యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్‌ తెలిపారు.

పోలీస్ సర్వీస్ యాప్ పోలీస్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిగా సీఎం జగన్‌ అభివర్ణించారు. ఈ రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటుందని.. పీఎస్‌లకు వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు యాప్‌ను రూపొందించామని సీఎం జగన్ ప్రకటించారు. ఫోన్లు పోయినా… ఈవ్ టీజింగ్ చేసినా.. లేదా ఇతర నేరాల బారిన పడినా.. చాలా మంది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. జరిగిన నష్టం కంటే..పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఇబ్బంది.. ఎక్కువ ఉంటుందని వారు భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేకుండా… పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరమే లేకుండా… యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని పోలీసులు అందుబాటులోకి తెచ్చారు.

అయితే దిశ యాప్ లాగా కాకుండా.. ఫిర్యాదు చేసిన ప్రతీ ఒక్కరికి నమ్మకం కలిగేలా… సర్వీసు అందిస్తే.. సంచలనాత్మక సంస్కరణ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే యాప్ ను.. అందుబాటులోకి తెచ్చారు కాబట్టి పోలీసులు ఎంత ఎక్కువగా రెస్పాండ్ అయితే.. ఎంత ఎక్కువగా నమ్మకాన్ని చూరగొంటారు. లేకపోతే.. ఆవిష్కరించి మూలన పడేసిన అనేక యాప్‌ల్లా ఇది కూడా మారిపోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close