లిక్కర్ స్కామ్ నిందితులతో జనసేన నేత వ్యాపారాలు !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ జరుపుతున్న సోదాల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ అనే ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించి .. వారి ద్గగర నుంచి సేకరించిన సమాచారంతో హైదరాబాద్‌లో మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ సారి ఓ పత్రికాఫీసు కూడా దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయింది. అది జనసేన పార్టీ నాయకుడు ముత్తా గోపాలకృష్ణకు చెందిన ఆంద్రప్రభ గ్రూప్.

అంధ్రప్రభ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడులు పెట్టారు. ఇది రహస్యంగా జరిగింది కాదు. నేరుగానే జరిగింది. ఈ అభిషేక్ బోయినపల్లి టీఆర్ఎస్ కీలక నేతలకు సన్నిహితుడు. ఆయనకు ఆయన పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని.. బ ినామీ పెట్టుబడులేనని అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రభ పత్రికను ప్రింట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ .. జాతీయ స్థాయిలో ఓ టీవీ చానల్ నిర్వహిస్తున్నారు. దాని పేరు ఇండియా ఎహెడ్. ఓ ప్రణాళిక ప్రకారమే ఆ చానల్‌లో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది.

జనసేన పార్టీలో ముత్తా కుటుంబం ఉంది. జనసేన పార్టీకి మంచి కవరేజీ ఇస్తూంటారు. అయితే సమయంలో జగన్‌కు అనుకూలంగా రాస్తూంటారు కానీ..ఆంధ్రప్రభను పట్టిచుకునేవారు పెద్దగా లేరు. కానీ ఇంగ్లిష్ చానల్ విషయంలో కాస్త ఎక్కువ పెట్టుబడులు పెట్టడంతో ఆ చానల్ ఉనికి చాటుకుంటోంది. ఆ చానల్‌కు ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా జాతీయ మీడియాలో తమకు స్పేస్ ఉంటుందన్న ఆలోచనతో పెట్టుబడులు పెట్టారన్న ఉద్దేశంతో ఈడీ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close