రైతుల పాదయాత్రలో జనసేన.. కానీ పవన్ కాదు !

అమరావతి రైతుల పాదయాత్రకు ఒక్క వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. వారితో కలిసి ఒక్క సారైనా నడిచి ప్రత్యక్షంగానూ సపోర్ట్ చేశాయి. ఇప్పటి వరకూ అలా ప్రత్యక్షంగా పాల్గొనని పార్టీ జనసేన మాత్రమే. అమరావతికి విస్పష్టంగా మద్దతు ప్రకటిస్తున్న జనసేన పార్టీ ఇంత వరకూ రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. చివరికి ఆ పార్టీ మిత్రపక్షం అయిన బీజేపీ కూడా పాల్గొంది. అప్పుడు బీజేపీ నుంచి జనసేన నేతలకు ఎలాంటి ఆహ్వానం అంద లేదు. ఇప్పుడు జనసేన స్వయంగా పాల్గొనాలని నిర్ణయించుకుంది.

అయితే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాకుండా.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇరవై ఆరో తేదీన ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న పాదయాత్రలో జనసేన శ్రేణులతో కలిసి పాల్గొంటారు. మద్దతు తెలియచేస్తారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న కాలంలోచివరి ఏడాది అమరావతిపై కుల ముద్ర వేయడంలో పవన్ కల్యాణ్ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను మాత్రం ఆయన సమర్థించలేదు.

అమరావతి రైతులకే మద్దతు తెలిపారు. అమరావతి రైతుల కోసమే.. తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని కూడా ప్రకటించారు. పలుమార్లు అమరావతి రైతుల శిబిరాల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ జనసేన ప్రత్యక్షంగా రైతులకు మద్దతు తెలుపుతోంది. అయితే పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం రైతుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close