5 ఎంపీ సీట్లలో తమ గెలుపు ఖాయమన్న జనసేన నేత మాదాసు గంగాధరం

జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అన్న చర్చ జనసేన అభిమానులలోనే కాకుండా ఇటు సామాన్య ప్రజానీకంలో కూడా బాగా నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు బలమైన మీడియా అండ ఉండడంతో, వారు జనసేనకు రెండు నుంచి మూడు సీట్లకు మించి రావు అని పదేపదే చేస్తున్న ప్రచారం కారణంగా తటస్థ ఓటర్లలో, సామాన్య ప్రజానీకంలో కొంతమంది అదే విషయాన్ని నమ్ముతూ ఉన్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన పార్టీ ప్రభావాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేం అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జనసేన నేత మాదాసు గంగాధరం ఒక సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీకి ఐదు ఎంపీ సీట్లు ఖచ్చితంగా రానున్నాయని వ్యాఖ్యానించారు.

జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసిన విశాఖపట్నం నియోజకవర్గం, నాగబాబు పోటీచేసిన నరసాపురం నియోజకవర్గం , అమలాపురం రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాలలో జనసేన గెలవ బోతోందని మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో సమాచారం ఆధారంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని, నియోజకవర్గాల్లో ఓటర్లు తాము నియోజకవర్గ అభ్యర్థి బట్టి కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బట్టి తాము ఓటు వేశామని చెప్పారు అని మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా, జనసేన అభిమానులకు మాదాసు గంగాధరం వ్యాఖ్యలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close