స్టీల్ ప్లాంట్‌కు మూలధనం ఇచ్చేందుకు “జేడీ” కూడా రెడీ !

స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను అందరూ కలిసి కామెడీ చేసేస్తున్నారు. అదేదో స్టీల్ ప్లాంట్ అమ్మడానికి .. కొనడానికి వేస్తున్న బిడ్లు అన్నట్లుగా బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ప్రారంభిస్తే.. దాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. బిడ్ల వేయాలంటూ రోజూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సెయిల్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేయడమే కాదు.. ఇవాళ స్వయంగా తాను బిడ్ వేసేశారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

స్టీల్ ప్లాంట్ ఈవోఐలో పాల్గొనడానికి ఇవాళే చివరి రోజు. ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో ర్యాలీ నిర్వహించిన తర్వాత నామినేషన్లు దాఖలు చేసినట్లుగా EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. ఈవోఐ ప్రకారం అయితే నగదు లేదా ముడి సరకు మూలధనంగా సమకూర్చాలి. కానీ జేడీ దగ్గరే కాదు ఆయనతో ర్యాలీలో పాల్గొన్నఎవరి వద్ద ముడి సరుకు కానీ.. స్టీల్ ప్లాంట్ మూలధనం కోసం అవసరమైనంత నగదు కానీ ఉండవు. మరి ఎలా బిడ్డింగ్ దాఖలు చేశారంటే. జేడీ లక్ష్మినారాయణ.. ప్రజల నుంచే నిధులు వసూలు చేస్తామని ప్రకటించారు.

క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో మూలధనం సేకరిస్తామని నెలకు రూ. 850కోట్లు ఉంటే ఉక్కు పరిశ్రమ నిలదొక్కుకుంటుందని ఆయన చెబుతున్నారు. తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కసారి వందరూపాయలు ఇస్తే చాలని ఆయన లెక్కలు చెప్పారు. మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాలు సేకరణ ప్రారంభిస్తామన్నారు. తొలి మొత్తంగా రూ. 200 విరాళాలు సేకరణ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ను బిడ్డలా కాపాడుకోవాలి…ఆ ఉద్దేశంతోనే వర్కింగ్ క్యాపిటల్ బిడ్డింగ్ లో పాల్గొన్నానని ఆయన చెబుతున్నారు. కేంద్రం ప్లాంట్ ను క్లీన్ షేవ్ చేయాలని చూస్తే క్లియర్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. మొత్తంగా జేడీ మెల్లగా పక్కా రాజకీయ నేతగా మారిపోతున్నారన్న అభిప్రాయం మాత్రం ఇలాంటి వాటి వల్ల బలంగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close